china: చైనాలో జననాల కరవు
ఏ దేశాన్నైనా జనాభా విస్ఫోటం భయపడుతుంది. చైనాను మాత్రం గత కొన్నాళ్లుగా
వరుసగా ఐదో ఏడాదీ తగ్గిన వృద్ధి
బీజింగ్: ఏ దేశాన్నైనా జనాభా విస్ఫోటం భయపడుతుంది. చైనాను మాత్రం గత కొన్నాళ్లుగా జనాభా తగ్గుదల కలవరపెడుతోంది. సోమవారం ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం(ఎన్బీఎస్) విడుదల చేసిన తాజా డేటా.. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న డ్రాగన్ ఆశలకు గండికొట్టేలా ఉంది. గత ఏడాది కాలంలో ఆ దేశ జనాభాలో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. 2020లో చైనా జనాభా 141 కోట్ల 20 లక్షలు. తాజా 2021 గణాంకాల ప్రకారం 141 కోట్ల 26 లక్షలు. అంటే జాతీయ వృద్ధి రేటు 1000 మందికి 0.34 మాత్రమే మాత్రమే. గత ఏడాది చైనాలో కోటి 62 లక్షల కొత్త శిశువులు మాత్రమే జన్మించారు.
ఇంత తక్కువ సంఖ్య నమోదు కావడం 1950 తర్వాత ఇదే తొలిసారి. శిశు జననాల రేటు ప్రతి 1000 మందికి 7.52 మాత్రమే. 1978 తర్వాత ఇదే కనిష్ఠస్థాయి. గత ఐదేళ్లుగా శిశు జననాల రేటులో తగ్గుదలే కనిపిస్తోంది. మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. 60 ఏళ్లు దాటిన వారు 26.4 కోట్లకు చేరుకున్నారు. 2020తో పోలిస్తే 18.7% అధికం. దీని వల్ల పింఛన్లు...ఇతర ప్రయోజనాల భారం ఆర్థికవ్యవస్థపై తీవ్రంగా పడనుంది. జనాభా పెరుగుదల కోసం 2016లో ఏక సంతాన నిబంధనకు చైనా వీడ్కోలు పలికింది. 2020లో ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని.. అప్పటివరకు జన సంఖ్యలో పెద్దగా ఎదుగుదల ఉండదని చైనా జాతీయ అభివృద్థి, సంస్కరణల కమిషన్ ఉపాధ్యక్షుడు నింగ్ జిజె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!