China vs Usa: సూపర్ పవర్ ఎవరో చైనాకు చెప్పిన అమెరికా..!
నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ హంగామా పెరిగిపోయిది. నాలుగురోజులపాటు నాన్స్టాప్ యుద్ధవిన్యాసాలు పేరిట క్షిపణి ప్రయోగాలు, ఫైటర్ జెట్ల విన్యాసాలు చేపట్టింది. ఓ రకంగా
తైవాన్ వద్ద డ్రాగన్ హంగామాకు అదే కారణం..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ హంగామా పెరిగిపోయిది. నాలుగురోజులపాటు నాన్స్టాప్ యుద్ధవిన్యాసాల పేరిట క్షిపణి ప్రయోగాలు, ఫైటర్ జెట్ల విన్యాసాలు చేపట్టింది. ఓ రకంగా పెలోసీ పర్యటన ఆసియా ప్రాంతంలో డ్రాగన్ ప్రతిష్ఠకు గండి కొట్టింది. వాస్తవానికి పెలోసీ పర్యటనతో దక్షిణ చైనా సముద్రంలోని చైనా బాధిత దేశాలు అమెరికా దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మరికొన్నాళ్లలో మూడోసారి పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్న షీ జిన్పింగ్కు ఈ పర్యటన పెద్ద ఎదురు దెబ్బ. ఆయన ఇమేజ్ను దెబ్బతీయడం ఖాయం.
బాస్ ఎవరో చెప్పకనే చెప్పిన వాషింగ్టన్..
నాన్సీ పెలోసీ విమానంతోపాటు చైనా విమానం కూడా తైవాన్లో ల్యాండ్ అవుతుందంటూ గ్లోబల్ టైమ్స్ కొన్నాళ్ల క్రితం కథనం ప్రచురించింది. రోజులు గడిచాయి.. నాన్సీపెలోసీ విమానం ఎలాంటి అడ్డంకులు లేకుండా అమెరికా రక్షణ ఛత్రంలో తైవాన్ చేరింది. అక్కడే దాదాపు ఒక పూటకు పైగా ఉండి.. ఆ తర్వాత దక్షిణ కొరియా దిశగా ఎగిరిపోయింది.
వాస్తవానికి అప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. ఐరోపా మిత్రులకు మద్దతుగా ఉక్రెయిన్ సైన్యాన్ని వెనకుండి నడిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక నష్టాలను తట్టుకొనేందుకు సిద్ధపడిపోయింది.
మరో వైపు పెలోసీ తైవాన్ పర్యటనకు రోజుల ముందు అల్ఖైదా అగ్రనేత అల్-జవహరీని అఫ్గాన్ భూభాగంపైనే అమెరికా డ్రోన్ మట్టుబెట్టింది. ఈ క్రమంలో తాలిబన్ల అనుమతి లేకుండానే డ్రోన్లు అఫ్గాన్ గగనతలాన్ని చేరుకొని.. లక్ష్యాన్ని నేలకూల్చి సురక్షితంగా తిరిగి వచ్చాయి. తాలిబన్లు నిరసన తెలియజేస్తూ ప్రకటనలు తప్ప మరేమీ చేయలేకపోయారు.
ఆ తర్వాత నాన్సీ తైవాన్ పర్యటనను సురక్షితంగా ముగించారు. ఈ క్రమంలో అమెరికా క్యారియర్ గ్రూప్నకు చెందిన యుద్ధ నౌకలు నేరుగా చైనా సమీప జలాల్లోకి చేరుకొన్నాయి. ఒకే సమయంలో ప్రపంచంలోని వేర్వేరు చోట్ల వాషింగ్టన్ ఆపరేషన్లు నిర్వహించడం చూస్తే.. అమెరికాయే ఇప్పటికీ సూపర్ పవర్ అనే విషయాన్ని డ్రాగన్కు స్పష్టంగా చెప్పినట్లైంది.
చైనా ఇప్పుడెందుకు విన్యాసాలు..?
తైవాన్ను ఆక్రమించుకొనే శక్తి సామర్థ్యాలు ఇప్పటికీ బీజింగ్కు లేవని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తైవాన్ను ఆక్రమించుకొనే కంటే.. దాని ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీయడం తేలికని చైనా భావించింది. అందుకే తైవాన్ను దాదాపు చుట్టుముట్టి ఆరు వైపుల నుంచి యుద్ధ విన్యాసాలను చేపట్టింది. తాము తలచుకొంటే తైవాన్ను పూర్తిగా ముట్టడించగలమని చెప్పేందుకు వీటిని చేపట్టిందని హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకుడు బ్రయాన్ క్లార్క్ విశ్లేషించారు. ఈ విన్యాసాల కారణంగా నౌకాశ్రయాలు, వైమానిక మార్గాల్లో కార్గో రవాణాలో కొంత జాప్యం చోటు చేసుకోవచ్చు. తైవాన్ వద్ద సైనిక సంక్షోభం మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేయాలని చైనా వీటిని చేపట్టింది. దీంతోపాటు తైవాన్ సమీపంలో యుద్ధ విన్యాసాలు నిత్యకృత్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాంతంలోకి నౌకలను పూర్తిగా రానీయకుండా చేయడాన్ని యుద్ధం ప్రకటించడంతో సమానంగా(యాక్ట్ ఆఫ్ వార్) ప్రపంచ దేశాలు భావించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తరచూ ఈ ప్రాంతాన్ని బ్లాకేడ్ చేసే అవకాశంపై చైనా సైనిక పత్రికల్లో చర్చలకు వస్తోంది.
చైనా నేరుగా యుద్ధం చేసి లక్ష్యాన్ని సాధించాలనుకోవడంలేదని ర్యాండ్ కార్పొరేషన్ పరిశోధకుడు, మాజీ నేవీ అధికారి బ్రాడ్లీ మార్టీన్ అభిప్రాయపడ్డారు. యుద్ధం కంటే తక్కువ స్థాయిలో శక్తి ప్రదర్శన చేయడమే చైనా ఉద్దేశమని పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థికంగా అమెరికా మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా, కెనడాల వంటి వాటిని వేధించే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా తైవాన్ గగనతలం మీదుగా చైనా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని తైవాన్ సమీపంలో పడ్డాయి. మరోవైపు ఐదు క్షిపణులను జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ప్రయోగించింది. ఇటువంటి చోట్ల క్షిపణులు పడటం జపాన్కు కొత్తేమీ కాదు. గతంలో ఉత్తర కొరియా క్షిపణులు కూడా ఇక్కడపడ్డాయి. కానీ, ఈ సారి చైనా ఆ పనిచేయడం కొంత ఆందోళనకరం. జపాన్లోని ఒకినావాలో అమెరికాకు అతిపెద్ద సైనిక స్థావరం ఉన్న విషయం తెలిసిందే. తైవాన్నే కాదు.. అమెరికా బేస్లను కూడా లక్ష్యంగా చేసుకోగలననే సంకేతాలు పంపేందుకు ఈ చర్యలని వాషింగ్టన్లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ బడ్జెటరీ సంస్థ అధ్యక్షుడు థామస్ జి. మహనకెన్ పేర్కొన్నారు.
చైనా దూకుడుకు కళ్లెం అవే..
వాస్తవానికి అమెరికా ప్రధాన భూభాగం చైనాకు చాలా దూరంలో ఉంది. చైనా ప్రాథమికంగా సమీపంలోని అమెరికా స్థావరాలపై దాడి చేసి నష్టపర్చగలదు. కానీ, అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాంలు చైనా తీర ప్రాంతంతోపాటు.. ప్రధాన భూభాగాన్ని దాదాపు చుట్టేసే ఉంటాయి. వీటికి తోడు గువాం సైనిక స్థావరం ఉండనే ఉంది. వీటి సమీపం నుంచి అమెరికా నేరుగా చైనా ఆర్థిక ఆయువుపట్టు వంటి నగరాలపై దాడి చేసే అవకాశాలున్నాయి. ఇదే చైనాను దూకుడుగా ముందుకు వెళ్లనీయదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె