china: చైనా జీరో కొవిడ్ ఎఫెక్ట్.. కుంగిన ఎగుమతులు..!
జీరో కోవిడ్ పేరిట చైనా చేస్తున్న హడావుడి వైరస్ను వ్యాప్తిని నిలువరించకపోగా.. ఆ దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఎగమతులు బాగా మందగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వైరస్ వ్యాప్తితో డ్రాగన్కు ఆర్థిక దెబ్బ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జీరో కొవిడ్ పేరిట చైనా చేస్తున్న హడావుడి.. వైరస్ వ్యాప్తిని నిలువరించకపోగా ఆ దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఎగుమతులు బాగా మందగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సరకు రవాణాకు ఆంక్షలు అడ్డం కావడం.. ప్రధాన నగరాలు లాక్డౌన్ ఆంక్షల్లో మగ్గడం.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి పుంజుకోవడం దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. 2019 తర్వాత భారీగా పెరిగిన చైనా ఎగుమతులు ఇప్పుడు మెల్లగా తగ్గుతున్నాయి.
ఏం జరిగింది..?
చైనా ఎగుమతుల వృద్ధిరేటు ఏప్రిల్లో బాగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే కేవలం 3.9శాతం మాత్రమే పెరిగాయి. ఆ దేశంలో ప్రధాన ట్రేడింగ్ హబ్ అయిన షాంఘై అత్యంత కఠిన ఆంక్షల మధ్యలో ఉండటం దీనికి ప్రధాన కారణం. దీంతోపాటు చైనా జీడీపీలో 30శాతం వాటా కలిగి ఉన్న మరో 41 నగరాల్లో కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
కొవిడ్ పరిస్థితుల్లో కొంత మొత్తం వ్యాపారం పెరిగినా గొప్పే. కానీ, చైనా కస్టమ్స్ ఏజెన్సీ చెప్పిన 3.9శాతం పెరుగుదల విని ఆర్థిక నిపుణులు పెదవి విరవడానికి కారణం ఉంది. డ్రాగన్ ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో ఏప్రిల్ నెల నాటికి 8శాతం కంటే ఎక్కువగా ధరల పెరుగుదల నమోదైంది. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకొంటే ఎగుమతుల విలువ కూడా పెరుగుతుంది. ఈ లెక్కన 3.9శాతం వృద్ధి కేవలం ధరల పెరుగుదల వల్ల వచ్చిందే కానీ.. సరకుల ఎగుమతుల్లో పెంపు వల్ల వచ్చింది కాదు.
చైనాలో నిర్వహించిన పర్చేజింగ్ మేనేజర్స్ సర్వే కూడా ఈ ఏడాదిలో ఎగుమతులు ప్రతి నెలా తగ్గుతూ వస్తున్నాయని తేల్చింది. ఏప్రిల్ నెలలో కంప్యూటర్లు, గృహోపకరణాల ఎగుమతులు పడిపోయినట్లు తేలింది. పశ్చిమ దేశాలు లాక్డౌన్లో ఉన్న సమయంలో వీటికి భారీ డిమాండ్ లభించింది.
చైనాలో వస్తువుల ధరల పెంపుపై దాని వ్యాపార భాగస్వాములను ద్రవ్యోల్బణం వైపు నెట్టే ప్రమాదం ఉందన్న భయాలు నెలకొన్నాయి. చైనా కొవిడ్ నిబంధనల కారణంగా ఏర్పడిన అడ్డంకులు చూసి దాని పోటీదారులు ధరలు పెంచే అవకాశం ఉంది. కాకపోతే అమెరికా వంటి దేశాలపై దీని ప్రభావం పెద్దగా ఉండదని ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ శాన్ఫ్రాన్సిస్కో ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. చాలా వరకూ అమెరికా ద్రవ్యోల్బణం స్థానిక కారణాలతోనే పుట్టుకొస్తుందని చెబుతున్నారు.
అడుగడుగునా అడ్డంకులు..
చాలా చోట్ల ట్రక్కులు కార్గోను తీసుకెళ్లేందుకు మోటార్వే చెక్పాయింట్లలోకి రానీయడంలేదు. అంతేకాదు, అంతర్జాతీయ ట్రేడింగ్ విషయంలో కూడా చైనా ఆంక్షలను అమలు చేస్తోంది. ఏప్రిల్ మధ్య నాటికి షాంఘై ఓడరేవు బయట దాదాపు 506 నౌకలు కార్గో ఎగుమతి, దిగుమతుల కోసం వేచి ఉన్నాయి. అదే ఫిబ్రవరిలో వేచి ఉన్న నౌకల సంఖ్య 260 మాత్రమే. ఈ విషయాన్ని షిప్పింగ్ అనలటిక్స్ సంస్థ విండ్ వర్డ్ వెల్లడించింది.
చైనా అంచనాలు గతి తప్పి..
చైనా కర్మాగారాలకు ‘క్లోజ్డ్ లూప్’ పేరిట ఓ విధానం అమలు చేస్తోంది. దీనిలో కార్మికులు బయటకు రాకుండా పనిచేసే చోటే ఉండిపోవడం. వారు వేరే వారిని కలవకూడదు. ఈ విధానంతో ఒమిక్రాన్ పెద్దగా వ్యాప్తిచెందదని భావించారు. కానీ, ఏదైనా క్లోజ్డ్ లూప్లోకి వైరస్ చొరబడితే.. మొత్తం ఉత్పత్తి ఆగిపోతోంది. ఇటీవల టెస్లాకు వైరింగ్ హార్నెస్లు సరఫరా చేసే సంస్థలో వైరస్ వ్యాప్తితో ఉత్పత్తి దెబ్బతింది. ఈ ప్రభావం టెస్లాపై కూడా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు