US: పెత్తనం కోసమే.. భారత్ పొరుగు దేశాలకు చైనా రుణాలు..!
భారత్ పొరుగు దేశాలపై చైనా (China) బలవంతంగా పెత్తనం చలాయించాలని చూస్తోందని అమెరికా (US) ఆరోపించింది. అందుకే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశాలకు రుణాల ఎర వేస్తోందని దుయ్యబట్టింది.
ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా
వాషింగ్టన్: భారత్ (India) పొరుగు దేశాలైన పాకిస్థాన్ (Pakistan), శ్రీలంక (Sri Lanka)కు చైనా మితిమీరిన రుణాలు ఇస్తుండటంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పెత్తనం కోసమే డ్రాగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అగ్రరాజ్యం మండిపడింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ భారత పర్యటన నేపథ్యంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్కు బోర్డ్ ఆఫ్ చైనా డెవలప్మెంట్ బ్యాంక్ 700 మిలియన్ డాలర్ల రుణాలు మంజూరు చేసినట్లు పాక్ ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ తెలిపారు. దీని గురించి డొనాల్డ్ లును మీడియా ప్రశ్నించగా.. చైనా (China) వ్యవహారంపై భారత్తో తీవ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు. ‘‘భారత పొరుగు దేశాలకు చైనా మంజూరు చేస్తున్న రుణాల గురించి మేం ఆందోళన చెందుతున్నాం. ఆ దేశాలపై బలవంతంగా పెత్తనం చలాయించేందుకు డ్రాగన్ వాటిని ఉపయోగించే అవకాశాలున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత్ సహా ఆసియా దేశాలతో తాము నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నామని, ఆయా దేశాలు తమ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా సాయం చేసేందుకు అగ్రరాజ్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అంతేగానీ, చైనా (China) సహా బయటి వ్యక్తుల బలవంతంతో ఆ నిర్ణయాలు ఉండకూడదని అన్నారు.
ఇక, ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) యుద్ధం విషయంలో భారత్ అవలంబిస్తున్న వైఖరిపైనా ఆయన స్పందించారు. రష్యా విషయానికొస్తే భారత్ ‘యుద్ధం’ అనే పదాన్ని వాడటం లేదని వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘‘గత ఆగస్టులో మోదీ (Modi) మాట్లాడుతూ.. ‘ఇది యుద్ధాల శకం’ కాదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)కు సూచించారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ గత సెప్టెంబరులో ఐరాసలో మాట్లాడుతూ.. ‘ఈ యుద్ధాన్ని చర్చలతోనే ముగించాలని’ పిలుపునిచ్చారు. మరి యుద్ధం అనే పదాన్ని ఉపయోగించట్లేదు అనడం సరికాదు కదా’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం