Chinese Spy Balloon: భారత్పై చైనా బెలూన్ గూఢచర్యం..!
చైనా నిఘా బెలూన్లను వాడి భారత్కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించారు. చైనా వాయుసేన ఈ బెలూన్ నిఘాకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా నిఘా బెలూన్(Chinese Spy Balloon) వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటువంటి బెలూన్ల సాయంతో డ్రాగన్ కొన్నేళ్లుగా నిఘా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చైనా నిఘాపెట్టిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ఇందు కోసం చైనా పురాతన పద్ధతులకు అత్యాధునిక సాంకేతికతను జోడించి నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ దేశాల సైనిక కదలికలను గమనిస్తోంది.
హెయినన్ ప్రావిన్స్ కేంద్రంగా..
హెయినన్ ప్రావిన్స్ కేంద్రంగా బెలూన్లతో చైనా(china) నిఘా కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడి దక్షిణ తీరంలో వీటిని ఎగురవేసి భారత్, జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో సైన్యం, ఆయుధాల మోహరింపులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు వాషింగ్టన్పోస్టుకు తెలియజేశారు. ఈ బెలూన్ నిఘా కార్యక్రమం చైనా వాయుసేన ఆధీనంలో జరుగుతోంది. ప్రపంచంలోని ఐదు ఖండాల్లో ఇటువంటి బెలూన్లు కనిపించాయి.
హెయినన్లో పీఎల్ఏ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు కూడా ఉన్నాయి. దీనిని వాస్తవానికి నౌకాదళ కేంద్రంగా చెబుతారు. కానీ, జె-8 ఇంటర్సెప్టర్ విమానాల ప్రధాన బేస్ కూడా ఇక్కడే ఉంది. 2001లో ఇక్కడి నుంచి ఎగిరిన జె-8 విమానం అమెరికాకు చెందిన ఈపీ-3 నిఘా విమానాన్ని ఢీకొంది.
అమెరికాకు చెందిన డిప్యూటి విదేశాంగ శాఖ మంత్రి వెండీ షెర్మన్.. చైనా బెలూన్ వ్యవహారంపై 40 దౌత్యకార్యాలయాలకు చెందిన 150 మందికి సమాచారం తెలియజేశారు. అంతేకాదు ప్రతి అమెరికా దౌత్య కార్యాలయానికి సమగ్ర సమాచారం పంపించారు. ఆ సమాచారాన్ని అమెరికా మిత్రదేశాలతో పంచుకోనున్నారు. జపాన్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను చైనా లక్ష్యంగా చేసుకోవడంపై అప్రమత్తమైంది.
200 అడుగుల ఎత్తైన భారీ ఆకారంలో..
చైనా ప్రయోగించిన బెలూన్ సుమారు 200 అడుగుల ఎత్తు ఉన్నట్లు సమాచారం. ఇది కొన్ని టన్నుల బరువును కూడా మోసేలా డిజైన్ చేశారు. సముద్రంలో దీనిని కూల్చిన ప్రదేశం నుంచి అమెరికా దళాలు శకలాలను సేకరిస్తున్నాయి. వీటిని చైనాకు తిరిగి ఇచ్చే ప్రశ్నేలేదని అమెరికా తేల్చిచెప్పింది. వీటిని విశ్లేషించి బెలూన్ సాంకేతిక సామర్థ్యాలు, అది ఏ ఉపగ్రహాలతో అనుసంధానమైంది, మరేమైనా సున్నితమైన పరికరాలు ఉన్నాయా అనేది నిర్ధారించుకోనున్నారు. దీంతోపాటు ఇది ఎటువంటి డిజిటల్ సిగ్నేచర్లను సేకరించిందో కూడా తెలుసుకోనున్నారు. అవసరమైతే వీటిల్లోని పరికరాలను పునర్నిర్మించి బెలూన్ పనితీరును పరిశీలించనున్నారు. దీంతోపాటు బెలూన్ నిర్మాణానికి ఉపయోగించిన పరికరాల సప్లైచైన్ను కూడా అమెరికా అధికారులు గుర్తించనున్నారు. అమెరికాలోనే అత్యున్నత నిపుణులు పనిచేసే ఎఫ్బీఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ బృందం శకలాలను విశ్లేషించనున్నారు. దాదాపు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడిన శకలాలను అమెరికా నౌకాదళం జాగ్రత్తగా సేకరిస్తోంది.
అమెరికా రక్షణ మంత్రి ఫోన్ చేసినా..
బెలూన్ను కూల్చివేసిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చైనా రక్షణ మంత్రితో ఫోన్లో సంభాషించాలని ప్రయత్నించారు. కానీ, చైనా వైపు నుంచి స్పందన కరవైంది. ఇటువంటి సమయాల్లో మా సైన్యాల మధ్య కమ్యూనికేషన్ ఉండాలి.. కానీ, దురదృష్టవశాత్తు మా విన్నపాన్ని చైనా నిరాకరించిందని పెంటగాన్కు చెందిన బ్రిగేడియర్ జనరల్ పాట్రిక్ రైడర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు