South Africa: ఒమిక్రాన్ ఉద్ధృతి.. రికార్డుస్థాయిలో కరోనా పాజిటివిటీ రేటు
దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడ కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది.
ఒమిక్రాన్ ఉపరకాలతో విస్తృత వేగంతో వైరస్ వ్యాప్తి
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులోనే ఉన్నప్పటికీ పలు దేశాల్లో మాత్రం భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల విజృంభణతో దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడ కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో గతకొన్ని రోజులుగా కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 8524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది. అంతకుముందు వేవ్ సమయంలో డిసెంబర్ 5న అక్కడ 32.2శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఈ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈస్థాయిలో రికార్డయ్యింది. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు కరోనా గరిష్ఠ పాజిటివిటీ రేటు 34.9శాతంగా (డిసెంబర్ 14న) ఉంది. ఇలా వైరస్ సంక్రమణ అత్యంత వేగంగా ఉందని చెప్పడానికి తాజా గణాంకాలే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొవిడ్తో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. గడిచిన రెండు రోజుల్లో ఐదుగురు మరణించగా.. 2600 మంది ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. గతేడాది మధ్యలో డెల్టా వేరియంట్ ప్రతాపం చూపించగా.. ఆ సమయంలో ఒక్కరోజే 16వేల మంది ఆస్పత్రి పాలయ్యారు.
నాలుగో వేవ్ సమయంలోనే దక్షిణాఫ్రికా సమీపంలోని బోట్స్వానాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది. అనంతరం దాని నుంచి ఉత్పరివర్తనం చెందిన బీఏ.4, బీఏ.5 ఉపరకాలు అత్యధిక సంక్రమణ సామర్థ్యం కలిగి వున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజాగా వీటివల్లే కొవిడ్ ఉద్ధృతి మరింత పెరుగుతోందని దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదే సమయంలో ఈ ఒమిక్రాన్ ఉపరకాలు అక్కడికే పరిమితం కాకుండా ఇతర దేశాలకు విస్తరించాయి. అయినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం కాస్త ఊరట కలిగించే విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది. -
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
తప్పుడు మార్గంలో బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు యత్నించిన ఓ మహిళ ఏకంగా చనిపోయిన తన బంధువును బ్యాంకుకు తీసుకొచ్చింది. -
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
కెనడా (Canada) ఎయిర్పోర్టులో మాయమైన బంగారం కంటెయినర్ కేసులో ముందడుగు పడింది. ఆ కేసులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
ఆ దేశంలోని ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని (work from home) తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. -
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా