టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్పోర్టులో వదిలేసిన జంట..
విమానం(Plane) ఎక్కడ మిస్ అవుతుందోనన్న కంగారులో చంటి బిడ్డను వదిలి విమానం ఎక్కేందుకు వెళ్లిపోయిందో జంట. ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది అవాక్కయ్యారు.
టెల్ అవీవ్: ఇజ్రాయెల్(Israel) విమానాశ్రయంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. తమ బిడ్డకు టికెట్ తీసుకునేందుకు నిరాకరించిన ఓ జంట.. ఆ చిన్నారిని చెక్ ఇన్ కౌంటర్ వద్దే వదిలి విమానం ఎక్కేందుకు వెళ్లిపోయారు.
బెల్జియం వెళ్లేందుకు ఓ జంట తమ బిడ్డతో కలిసి ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానం ఎక్కాలంటే చిన్నారికి కూడా టికెట్ తీసుకోవాలని సిబ్బంది తెలిపారు. అప్పటికే ఎయిర్పోర్టుకు ఆలస్యంగా వచ్చిన ఆ జంట.. బిడ్డకు టికెట్ తీసుకోలేదు సరికదా.. స్ట్రోలర్లో ఉన్న బిడ్డను వదిలేసి బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆ జంటను వెనక్కి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం అయిందని, ఆ చిన్నారి వారి తల్లిదండ్రుల చెంత ఉందని తెలిపారు. దీనిపై అక్కడి సిబ్బంది స్పందిస్తూ.. ‘ఇలాంటి ప్రవర్తనను మేం ఇంతకుముందెన్నడూ చూడలేదు. మా కళ్లను మేం నమ్మలేకపోయాం’ అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్న ఆ జంట విమానం ఎక్కడ మిస్ అవుతుందోనన్న తొందరలో ఉన్నారని, ఆ కంగారులో తమ బిడ్డనే మర్చిపోతున్నామనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారని మరో అధికారి వెల్లడించారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.