Covid-19: 78 సార్లు పాజిటివ్.. 14 నెలలుగా ఐసోలేషన్లోనే..!
కరోనా వైరస్ ఓ వ్యక్తి శరీరాన్ని వదలడం లేదు. ఏకంగా 78 సార్లు పాజిటివ్గా తేలింది.......
ఇస్తాంబుల్: లక్షణాలు లేకపోయినప్పటికీ.. కరోనా వైరస్ మాత్రం అతడి శరీరాన్ని వదలడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 78 సార్లు పరీక్షలు జరిపినా ఫలితం మాత్రం పాజిటివ్ అని తేలడం.. ఇక చేసేది లేక 14 నెలలుగా ఐసోలేషన్లోనే ఉంటూ నరకం అనభవిస్తున్నాడు ఆ వృద్ధుడు. 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు 78 సార్లు కరోనా టెస్టు చేయగా.. అతడికి అన్నిసార్లూ పాజిటివ్గానే తేలింది.
టర్కీలోని ఇస్తాంబుల్ వాసి ముజఫర్ కయాసన్ (56)కు 2020 నవంబర్లో తొలిసారి కరోనా సోకింది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. లక్షణాలేవీ లేవు. కానీ టెస్టు చేస్తే మాత్రం పాజిటివ్ అని వచ్చింది. లక్షణాలు లేకపోవడంతో రెండు వారాల తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందాడు. కొద్దిరోజుల అనంతరం పరీక్షలు నిర్వహించగా మళ్లీ పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత ఎన్నిసార్లు పరీక్షించినా ఫలితంలో మార్పు లేదు. ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్గానే తేలింది. మంచి ఆహారం తీసుకుంటూ తగిన ఔషధాలు వాడుతున్నప్పటికీ.. ఫలితంలో మార్పు రావడంలేదు.
అయితే ఇలా రావడానికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. ముజఫర్ లుకేమియా వ్యాధిగ్రస్థుడని, అతడి రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. లుకేమియా కారణంగా క్షీణించిపోయిన అతడి శరీరం.. కరోనా వంటి వైరస్లపై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేసుకోవడం లేదని తెలిపారు. అందుకే అతడికి కరోనా నెగెటివ్ రావడం లేదని చెబుతున్నారు. వైరస్ నుంచి కోలుకోవడం లేదు కాబట్టి.. ముజఫర్కు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఇలా ఎంతకాలం ఉండాలో తెలియక ముజఫర్ తీవ్ర వేదనకు గురవుతున్నాడు. తన సమస్యను తీర్చాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి