Covid Effect: 100కుపైగా దేశాల్లో ఆరోగ్య సేవలపై ప్రభావం..!
92శాతం దేశాల్లో కొవిడ్ కారణంగా ఇతర వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఎయిడ్స్, క్షయ, క్యాన్సర్ కేర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో దేశాలన్నీ తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్యసంస్థ
వాషింగ్టన్: కొవిడ్ మహమ్మారి సృష్టిస్తోన్న బీభత్సానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థలన్నీ ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగంపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడినట్లు ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల వీటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. మొత్తంగా 129 దేశాల్లో సర్వే జరపగా అందులో 92శాతం దేశాల్లో కీలకమైన ఆరోగ్య సేవలపై కొవిడ్ ప్రభావం స్పష్టంగా కనిపించిందని తేలింది. ముఖ్యంగా ఇతర వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఎయిడ్స్, క్షయ, క్యాన్సర్ కేర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స, సంరక్షణ సేవల్లో దేశాలన్నీ తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ప్రబలంగా ఉన్న సమయంలో ఆరోగ్య సేవలపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు నవంబర్-డిసెంబర్ 2021 మధ్యకాలంలో డబ్ల్యూహెచ్ఓ ఓ సర్వే నిర్వహించింది. అందులో భాగంగా 129 దేశాలనుంచి స్పందనలను విశ్లేషించింది. వాటిలో 100కుపైగా దేశాల్లో పోషకాహారం, క్యాన్సర్ కేర్, నాడీ సంబంధిత, హెచ్ఐవీ, క్షయ, మలేరియా, హెపటైసిస్, మానసిక రుగ్మతలతోపాటు ప్రసూతి సేవల్లో దేశాలన్నీ తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుముందు సర్వేలతో పోల్చి చూసినప్పుడు తీవ్రంగా ప్రభావితమైన సేవల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సేవల పునరుద్ధరణ, కొవిడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల ప్రాముఖ్యతను తాజా సర్వే స్పష్టం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ముఖ్యంగా కొవిడ్ ప్రభావంతో 2020లో అత్యవసర విభాగ సేవల్లో 21శాతం అంతరాయం కలిగినట్లు డబ్ల్యూహెచ్ఓ సర్వే పేర్కొంది. అనంతరం 2021 ప్రారంభం నాటికి అది 29శాతానికి పెరిగింది. తాజాగా 2021 చివరి నాటికి ఎమర్జెన్సీ సేవల్లో 36శాతం క్షీణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ముఖ్యంగా సర్వే జరిపిన దేశాల్లో దాదాపు 60శాతం దేశాల్లో తుంటి, మోకాలు ఆపరేషన్లలో తీవ్ర అంతరాయం కలగడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులకు అందించే సంరక్షణ సేవలు మరింత దిగజారినట్లు తెలిపింది.
ఇదిలాఉంటే, సర్వే చేసిన సమయంలోనే చాలా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ మొదలయ్యింది. ఈ వేరియంట్ ప్రభావంతో చాలా దేశాలు కొత్త వేవ్లను చవిచూశాయి. దాంతో కొన్ని దేశాల్లో ఆస్పత్రులపై ఒత్తిడి పెరగడంతోపాటు కొవిడ్ కట్టడిపైనే ఆయా ప్రభుత్వాలు దృష్టి పెట్టడంతో ఇతర ఆరోగ్య సేవలపై మరోసారి ప్రభావం పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు