China: చైనీయుల కరోనా తిప్పలు.. నెగెటివ్ వస్తే సిటీ నుంచి బయటకు..!
చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
షాంఘై: చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది ఇళ్లకే పరిమితమవ్వగా.. పాజిటివ్ వచ్చిన వారు ఇరుకైన ఐసోలేషన్ కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా నెగెటివ్ వచ్చిన వారికీ అక్కడ కష్టాలు తప్పట్లేదట. వైరస్ సోకని వారిని ఏకంగా నగరం నుంచే బయటకు పంపిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
షాంఘైలో నెగెటివ్ వచ్చిన వారిని సిటీ నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రాలకు పంపిస్తున్నట్లు స్థానిక మహిళ లూసీ తెలిపారు. ‘‘మా కాంపౌండ్లో చాలా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఒకవేళ మేం ఇక్కడే ఉంటే మాకు కూడా వైరస్ సోకుతుందని, మమ్మల్ని నగరం నుంచి వెళ్లిపొమ్మన్నారు. అర్ధరాత్రి సమయంలో నాతో పాటు అనేక మందిని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రానికి పంపారు. ఇక్కడ క్యాబిన్ లాంటి గదుల్లో ఉంచారు. ఇక్కడి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు. కానీ, మాకు మరో అవకాశం లేదు. మాకు చాలా భయంగా ఉంది. షాంఘై ప్రభుత్వంపై నమ్మకం పోతోంది’’ అని లూసీ ఆవేదన వ్యక్తం చేశారు.
షాంఘైలో గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. సోమవారం అక్కడ దాదాపు 7వేల కేసులు రాగా.. 32 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మూండంచెల లాక్డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి. ప్రజలు తమ కాంపౌండ్ నుంచి బయటకు రాకుండా ఇనుప బారియర్లను అమర్చుతున్నారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్లోనూ వైరస్ విజృంభిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్టారెంట్లలో భోజనం చేయడంపై నిషేధం విధించారు. ఒక్క కేసు వెలుగుచూసినా ఆ ఇళ్లు, భవనాలను సీల్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు