Vaccination: అయిదేళ్లు దాటినచిన్నారులకు కొవిడ్ టీకా.. బ్రెజిల్ దేశాధ్యక్షుడి రుసరుస!
కరోనా టీకాల విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తూ వస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో.. తాజాగా దేశంలో 5-11 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రణాళికపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆరోగ్య రెగ్యులేటరీ ‘అన్విసా’ ఆమోదం...
బ్రెసిలియా: కరోనా టీకాల విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తూ వస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో.. తాజాగా దేశంలో 5-11 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రణాళికపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆరోగ్య రెగ్యులేటరీ ‘అన్విసా’ ఆమోదం తెలపడంపై విమర్శలు గుప్పించారు! కొవిడ్తో పిల్లలు చనిపోవడం గురించి తాను వినలేదని.. తన 11 ఏళ్ల కుమార్తెకూ టీకా ఇప్పించబోనని తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మహమ్మారితో పిల్లలు చనిపోయే అవకాశం దాదాపు సున్నాగా ఉన్నా.. మీరు మీ బిడ్డకు టీకాలు వేయిస్తారా? అసలు దీని వెనుక ఉద్దేశం ఏంటి? వ్యాక్సిన్ ఉన్మాదుల ప్రయోజనాలేంటి?’ అంటూ బోల్సోనారో ప్రశ్నించారు. వ్యాక్సిన్లు పిల్లలపై దుష్ప్రభావాలు చూపుతాయనీ చెప్పారు.. కానీ, ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.
పిల్లలకు టీకా తప్పనిసరి కాదని బోల్సోనారో ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనందుకు ఏ పట్టణ మేయర్, రాష్ట్ర గవర్నర్ పిల్లలను స్కూళ్లకు వెళ్లకుండా అడ్డుకోలేరన్నారు. పైగా చిన్నారుల్లో వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు ఫైజర్ బాధ్యత వహించదని హెచ్చరించారు. అయితే.. బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్స్ మాత్రం అధ్యక్షుడి అభిప్రాయాన్ని కొట్టిపారేసింది. ‘బ్రెజిలియన్లు వైరస్ గురించి భయపడాలి.. కానీ, టీకాల గురించి కాదు’ అని ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. కొవిడ్ టీకాలు అయిదేళ్లు, ఆపైవారికీ సురక్షితమేనని అన్విసాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయా హెల్త్ రెగ్యులేటరీలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ‘ఫైజర్’ అభివృద్ధి చేసిన రెండు కోట్ల పీడియాట్రిక్ వ్యాక్సిన్లను కొనుగోలు చేసినట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి టీకాలు వేయడం ప్రారంభించనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట