ఒమిక్రాన్ విజృంభణ వేళ.. అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులే!
ఆస్పత్రి చేరికల పెరుగుదల ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులేనని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్చరిస్తోన్న నిపుణులు
వాషింగ్టన్: అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతితో ప్రపంచ దేశాలు కొత్త వేవ్లను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 11 లక్షలు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా కనపిస్తున్నప్పటికీ అవి అస్పత్రి చేరికలను మాత్రం నివారించలేక పోతున్నాయి. ఒకేరోజు లక్షన్నర మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి రావడం అక్కడి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచిస్తోన్న నిపుణులు.. నేటి పాజిటివ్ కేసులే రేపటి ఆస్పత్రి చేరికలకు సంకేతాలంటూ అప్రమత్తం చేస్తున్నారు. ఆస్పత్రి చేరికల పెరుగుదల ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులేనని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో నమోదవుతోన్న కేసుల్లో 98 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటున్నట్లు అక్కడి వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) డైరెక్టర్ రొషెల్లీ వాలెన్స్కై పేర్కొన్నారు. ఇదివరకే వైరస్ బారినపడడం.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల డెల్టా వేరియంట్ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పొందడం వల్ల తాజా వేరియంట్తో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన డేవిడ్ వోల్ అభిప్రాయపడ్డారు. కానీ వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఆందోళనకరమేనన్నారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయేందుకు సిద్ధంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరిల్యాండ్కు చెందిన ప్రొఫెసర్ నీల్ సెగల్ ఇటీవలే హెచ్చరించారు. కొవిడ్ రోగుల తాకిడితో అమెరికా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడుతున్న విషయాన్ని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ ధ్రువీకరించింది.
సంక్షోభం దిశగా..
దేశవ్యాప్తంగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ పైచేయి సాధించినట్లు సీడీసీ నివేదికలు పేర్కొంటున్నాయి. చాలా నగరాల్లో గతంలో కంటే ఎక్కువగా కొవిడ్ కేసులు రికార్డు కావడంతో పాటు ఆస్పత్రి చేరికలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇతర సర్జరీలను వాయిదా వేయడమో లేదా సిబ్బందిని సర్దుబాటు చేయడమో చేస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. కొలొరాడో, ఒరెగాన్తోపాటు చాలా రాష్ట్రాల్లో ఇదే విధమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు కొవిడ్ నిబంధనలను సరళతరం చేసేలా మరికొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేరిల్యాండ్ హాస్పిటల్ అసోసియేషన్ అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇలా కొవిడ్ బీభత్సం సృష్టిస్తోన్న వేళ.. మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కాపాడుకోవడం ఎంతో కీలకమని నీల్ సెగల్ స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితులు చేయిదాటే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు నమోదయ్యే కేసులు వచ్చే వారపు ఆస్పత్రి చేరికలకు సంకేతాలేనని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు