Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
తీవ్రమైన గుండెపోటు (STEMI) కేసులు ఇతర రోజులతో పోలిస్తే సోమవారమే ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
దిల్లీ: వయసుతో సంబంధం లేకుండా ఇటీవల చోటుచేసుకుంటున్న గుండెపోటు (Heart Attack) మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. జీవనశైలిలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలే ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇతర రోజులతో పోలిస్తే సోమవారం రోజే తీవ్రమైన గుండెపోటు (STEMI) కేసులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ఎస్టీ-సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (STEMI) అనేది ఓ రకమైన గుండెపోటు. సాధారణ భాషలో చెప్పాలంటే గుండె రక్తనాళం వంద శాతం పూడుకుపోవడం వల్ల తలెత్తే సమస్య ఇది. ఈ పరిస్థితి తలెత్తడం తీవ్ర అనారోగ్యంతోపాటు ఒక్కోసారి మరణానికీ దారితీస్తుంది. అయితే, దీనిపై ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. 2013 నుంచి 2018 మధ్యకాలంలో ఐర్లాండ్ ఆస్పత్రుల్లో చేరిన 10,528 మంది పేషెంట్ల సమాచారాన్ని విశ్లేషించారు. వీటికి సంబంధించిన అధ్యయన ఫలితాలను బ్రిటన్లోని మాంచెస్టర్లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్క్యులర్ సొసైటీ (BCS) కాన్ఫరెన్స్లో పరిశోధకులు వెల్లడించారు. ఆదివారం కూడా అంచనాల కంటే ఎక్కువగా స్టెమీ మరణాల రేటు ఉందని గుర్తించారు.
‘ప్రత్యేకమైన ఈ స్టెమీ గుండెపోటు ఏ సమయంలో సంభవిస్తుందనడానికి తాజా అధ్యయనం సాక్ష్యంగా నిలిచినప్పటికి.. వారంలో ఎక్కువగా ఏ రోజు చోటుచేసుకుంటున్నాయో అనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఇలా చేయడం వల్ల దీనిపై వైద్యులకు ఎంతో అవగాహన వస్తుంది. తద్వారా భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు’ అని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ మెడికల్ డైరెక్టర్ ఫ్రొ.నీలేష్ సమామి వెల్లడించారు. ‘వారంలో మొదటి రోజు (సోమవారం)-స్టెమీ సంభావ్యతకు మధ్య బలమైన సంబంధాన్ని కనుగొన్నాం. ఇది గతంలోనే వెల్లడైనప్పటికీ.. దీనిపై ఆసక్తి కొనసాగుతూనే ఉంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన బీహెచ్ఎస్సీ ట్రస్ట్ పరిశోధకుడు జాక్ లాఫన్ పేర్కొన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కార్కాడియం రిథమ్ కూడా ఓ కారణమని భావించడం సహేతుకం అన్నారు.
‘బ్లూ మండే’గా పిలిచే ఈ పరిస్థితులు సోమవారమే ఎందుకు ఎక్కువ సంభవిస్తాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వివరించలేకపోయారు. అయితే, గుండెపోటు కేసులు సోమవారం రోజునే ఎక్కువగా సంభవించడానికి కార్కాడియం రిథమ్ (శరీరం నిద్రపోవడం లేదా లేచే చక్రం)తో సంబంధం ఉందని ఇదివరకు జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మరోవైపు, బ్రిటన్లో ఈ స్టెమీ కారణంగా ప్రతిఏటా 30వేల ఆస్పత్రి చేరికలు నమోదవుతున్నాయి. ఇలా పూర్తిగా మూసుకుపోయిన గుండె నాళాలను తిరిగి తెరిపించేందుకు అత్యవసర యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా లక్షణాలను గుర్తించి ఆ పూడికను కరిగించే చికిత్సను అందించగలిగితే వ్యక్తి ప్రాణాలను కాపాడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.