ఇండోనేషియా విషాదాన్ని తలపించిన ఘటనలెన్నో.. రోమ్లో అప్పుడు 20వేల మంది మృతి!
ఇండోనేషియాలోని ఫుట్బాల్ మైదానంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 174 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కడెక్కడ జరిగాయో ఓ సారి చూద్దామా?
ఇంటర్నెట్డెస్క్:ఇండోనేషియాలోని ఫుట్బాల్ మైదానంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 174 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తూర్పు జావా ప్రావిన్స్లో శనివారం నిర్వహించిన ఫుట్బాల్ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొంటున్నారు. అయితే, గతంలనూ ఇలాంటి విషాద ఘటనలు ఎక్కడెక్కడ చోటు చేసుకున్నాయో ఓసారి పరిశీలిస్తే..
హిల్స్బర్గ్లో ఎంతమందికి గాయపడ్డారో ఇప్పటికీ మిస్టరీనే!
యూకేలోని ఫుట్బాల్ మైదానాల్లో జరిగిన ప్రమాదాల్లో కెల్లా హిల్స్బర్గ్ ఘటన చాలా భయంకరమైనది. ఎంతమందికి గాయాలయ్యాయో ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు. దాదాపు 30 ఏళ్లపాటు ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణ చేపట్టింది. అది 1989, ఏప్రిల్ 15. హిల్స్బర్గ్ వేదికగా లివర్పూల్-నాటింగ్హాం జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పరిమితికి మించి ప్రేక్షకులు మైదానానికి వచ్చేశారు. సరిపడా చోటు లేకపోవడంతో వారంతా మ్యాచ్ నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 96 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 766 మందికి తీవ్రంగా గాయాలైనట్లు అంచనా. ఈ ఘటనకు గుర్తు చేసుకుంటూ లివర్పూల్ జట్టు ఆటగాళ్లు ఇప్పటికీ వారి జర్సీ కాలర్పై 96 నెంబర్ను ముద్రించుకుంటారు.
ఈస్టడో నేసియోనల్ మైదానం..328 మంది మృతి
అది 1964, మే 24. పెరూలోని లైమా నగరంలో గల ఈస్టడో నేసియోనల్ ఫుట్బాల్ మైదానంలో అర్జెంటీనా-పెరూ మధ్య ఒలింపిక్స్ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ చివరి దశకు వచ్చింది. ఈ లోగా ఓ గోల్ వివాదాస్పదమైంది. ఒక్కసారిగా పెరు దేశానికి చెందిన అభిమానులంతా మైదానంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించడంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రధాన మార్గాలన్నీ మూసివేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 328 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇబ్రాక్స్ మైదానంలో రెండు సార్లు తొక్కిసలాట
స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్ నగరం ఇబ్రాక్స్ మైదానంలో రెండుసార్లు తొక్కిసలాట చోటు చేసుకుంది. తొలుత 1902, ఏప్రిల్ 5న స్టాండ్ కూలిపోవడంతో 25 మంది బలికాగా.. దాదాపు 600 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 1972లో రేంజర్స్, క్రాస్ టౌన్ రైవల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 66 మంది మృతి చెందగా.. 140 మందికి గాయాలయ్యాయి.
మాస్కోలో 340మంది బలి!
అది 1982, అక్టోబరు 20. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేన్(యూఈఎఫ్ఏ) ఆధ్వర్యంలో డచ్ క్లబ్-స్పార్టక్ మాస్కో జట్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ చివర్లో ప్రేక్షకుల్లో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దాదాపు 7 ఏళ్ల వరకు సోవియట్ ప్రభుత్వం దాచిపెట్టింది. కానీ, ఈ తొక్కిసలాటలో 340 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కొందరు చెబుతుంటారు.
ఘనాలో 127 మంది..!
ఘనా దేశ రాజధాని అక్రాలోని ఒహేనే డిజాన్ క్రీడా మైదానంలో 2001, మే 9న ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలోని రెండు ప్రతిష్ఠాత్మక జట్లయిన అక్రా హార్ట్స్, అసంటే కొటోకొ జట్ల మధ్య ఓ లీగ్ మ్యాచ్ జరిగింది. ఉన్నట్లుండి ప్రేక్షకులు ఒక్కసారిగా మైదానంలోకి బాటిళ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. లిమాలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా తప్పించుకునే క్రమంలో తొక్కిసలాటతో ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 127 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి.
దశరథ్ రంగస్థల మైదానం..కాఠ్మాండు
అసియా ఖండంలోని ఫుట్బాల్ మైదానాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇది అతి భయంకరమైనది. 1988, మార్చి 12న నేపాల్, బంగ్లాదేశ్ ఫుట్బాల్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా వడగండ్ల వాన కుమ్మరించింది.దీంతో ప్రేక్షకుల గ్యాలరీలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో 93 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఇవేకాకుండా, టర్కీలోని అటాటుర్క్ స్టేడియంలో 1967లో జరిగిన ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రసెల్స్లోని హైసెల్ మైదానంలో 1985లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా 600 మంది గాయపడ్డారు.
రోమ్లో 20 వేల మంది మృతి!
మైదానాల్లో తొక్కిసలాటలు జరగడం ఇప్పుడు కొత్తేం కాదు. కీ.శ 27లో రోమ్ సమీపంలోని ఫిడేనియాలోని ఓ మైదానంలో జరిగిన ప్రమాదంలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు. గ్లాడిటోరియల్ క్రీడల సందర్భంగా చెక్క థియేటర్ కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత క్రీ.శ 140లో రోమ్లో ఓ చెక్క స్టాండు కూలిపోవడంతో 1100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది.
మైదానాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో జరిగిన తొక్కిసలాటల్లో అత్యధికంగా మరణాలు చోటుచేసుకున్న ఘటనలు..
* సెప్టెంబర్ 24, 2015- సౌదీ హజ్యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అత్యధికంగా 2411 ముస్లిం యాత్రికులు చనిపోయారు.
* 1990 జులైలోనూ అక్కడ 1426 మంది, 2006 జనవరిలో 345 మంది, 2004 ఫిబ్రవరిలో 251 మంది, 1998 ఏప్రిల్లో 118 మంది మృత్యువాతపడ్డారు.
* మే 23, 1994 - మహారాష్ట్రలోని నాగ్పుర్లో గొవారీ (Gowari stampede) కమ్యూనిటీ చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 114 మంది ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయాలపాలయ్యారు.
* ఫిబ్రవరి 20, 2003- అమెరికా రోడె ఐల్యాండ్లోని వార్విక్ నగరంలోని నైట్ క్లబ్ వేదికపై ఏర్పాటు చేసిన టపాసులతో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో 100 మంది చనిపోగా.. 200 మంది గాయాలపాలయ్యారు.
* జనవరి 25, 2005- మహారాష్ట్రలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
* ఆగస్టు 31, 2005- బాగ్దాద్లో ఓ మతపరమైన ఊరేగింపు జరుగుతోన్న సమయంలో బ్రిడ్జ్ కుప్పుకూలిపోయింది. ఆ ఘటనలో 640 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
* సెప్టెంబర్ 30, 2008- రాజస్థాన్ జోధ్పుర్లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 168 మంది చనిపోగా..100 మంది గాయాలపాలయ్యారు.
* నవంబర్ 22, 2010- కాంబోడియా రాజధానిలో ఓ పండుగ వేళ జరిగిన ఘర్షణల్లో 340 మంది ప్రాణాలు కోల్పోయారు.
* ఏప్రిల్ 30, 2021-ఇజ్రాయెల్లో మౌంట్ మెరాన్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 45 మంది మృత్యువాతపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: యుద్ధం తర్వాత సరిహద్దుల్లో భద్రతా చర్యలకు ఇజ్రాయెల్ ప్రతిపాదనలు
భవిష్యత్తులో ఉగ్రవాదుల నుంచి తమ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇందుకోసం సరిహద్దు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై తమ ప్రతిపాదనను అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ తెలియజేసింది. -
దక్షిణ గాజాపై దాడి
దక్షిణ గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ శనివారం బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే దాడులకు దిగింది. -
ఏ క్షణంలోనైనా కూలేలా ఇటలీ లీనింగ్ టవర్!
ఇటలీలో దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన 150 అడుగుల గరిసెండా టవర్ ఉనికి ప్రమాదంలో పడింది. -
ట్రంప్పై కొనసాగనున్న దావాలు
అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్పై 2021 జనవరి 6న జరిగిన దాడికి సంబంధించి తనపై దాఖలైన దావాలను కొట్టివేయాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అప్పీలును వాషింగ్టన్ డీసీ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తోసిపుచ్చింది. -
హిమాలయాల ఘోష ఆలకించండి
భూతాపం అధికమవుతున్న పరిస్థితుల్లో హిమాలయాల్లోని హిమానీనదాలు ఆందోళనకర స్థాయిలో కరిగిపోతున్నాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఇకపై నిర్మించం
భూతాపానికి అత్యధికంగా కారణమవుతున్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. -
హమాస్ నేతల కోసం వేట!
ప్రపంచ దేశాల ఒత్తిడితో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమించినా.. హమాస్ కీలక నేతలను అంతమొందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్ దాడిలో మా సైనికుల మృతి: ఇరాన్
సిరియాపై ఇజ్రాయెల్ శనివారం జరిపిన వైమానిక దాడిలో తమ దేశానికి చెందిన ఇద్దరు పారామిలిటరీ రివల్యూషనరీ గార్డులు మృతి చెందారని ఇరాన్ వెల్లడించింది. -
అలా చేస్తే.. మీ ఉపగ్రహాలను ధ్వంసం చేస్తాం
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. అగ్రదేశం అమెరికాకు హెచ్చరికలు జారీచేశారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. -
ఇజ్రాయెల్ అనూహ్య నిర్ణయం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ గడువు ముగిసిన నేపథ్యంలో ఖతార్లోని తమ మధ్యవర్తులను ఇజ్రాయెల్ వెనక్కి రప్పించింది. -
చైనాకు రాకపోకలు నిషేధించండి
చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. -
సూడాన్ నుంచి ఐరాస సంస్థ నిష్క్రమణ
సూడాన్లో అంతర్యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి తరఫున ప్రయత్నిస్తున్న యూనిటామ్స్ సంస్థను సాగనంపాలని సూడాన్ ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తదనుగుణంగా తీర్మానించింది. -
సురక్షిత దేశాల జాబితాలో భారత్నెలా చేరుస్తారు?
భారత్ను సురక్షిత దేశాల జాబితాలోకి చేర్చడంపై బ్రిటన్ పార్లమెంటు బిల్లులను పరిశీలించే లార్డ్స్ కమిటీలోని సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తారు. -
పాక్ డ్రోన్ జారవిడిచిన పిస్తోళ్ల స్వాధీనం
దేశ సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ జారవిడిచిన రెండు పిస్తోళ్లను అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. -
Pakistan: బస్సుపై దుండగుల కాల్పులు.. ఎనిమిది మంది మృతి!
పాకిస్థాన్తో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. -
ఇండోనేసియాలో వరదలు.. 12 మంది గల్లంతు
ఇండోనేసియాను శనివారం ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సుమత్రా దీవిలో కొండచరియలు విరిగిపడి 12 మంది గల్లంతయ్యారు. -
గేయాలతో శిశువుల్లో పెరగనున్న భాషా సామర్థ్యాలు
శిశువుల ఎదుట గేయాలను ఆలపిస్తే వారు భాషను మెరుగ్గా నేర్చుకోగలుగుతారని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధన తేల్చింది. -
గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా
గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించిన వారం రోజులకే దక్షిణ కొరియా తన ప్రప్రథమ సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించింది. -
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్లోని మిందానో దీవిని శనివారం రాత్రి భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. -
Hamas: అప్పటి వరకు బందీలను వదిలే ప్రసక్తే లేదు: హమాస్
గాజాలో ఇజ్రాయెల్సైన్యం కాల్పులు విరమించే వరకు బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
DGP Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేసిన ఈసీ
-
Assembly election Results: మూడు రాష్ట్రాల ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా..!
-
Chhattisgarh Election Results: ఛత్తీస్గఢ్లో మోదీ మ్యాజిక్తో భాజపా జోరు
-
Telangana Election Results: తెలంగాణ ‘హస్త’గతం ఇలా..!
-
Assembly Election Results: మూడు రాష్ట్రాల్లో భాజపా జోరు.. ట్వీట్ చేసిన మోదీ
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా