Israel: పీఐజే రెండో టాప్ కమాండర్ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్..!
గాజాపట్టీపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీన ఇస్లామిక్ జిహాద్ (పీఐజే)గ్రూప్నకు చెందిన మిలిటెంట్ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఇక్కడ మృతులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది
ఇంటర్నెట్డెస్క్: గాజాపట్టీపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (పీఐజే)గ్రూప్నకు చెందిన మిలిటెంట్ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది మరణించినట్లు సమాచారం. వీటిల్లో పీఐజే నాయకులు ఖలీద్ మన్సూర్, తైసీర్ జబారీ ఉన్నారు. మరో ఆరుగురు చిన్నారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నుంచి 400కు పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్ను ఇజ్రాయెల్పైకి గాజా నుంచి ప్రయోగించారు. పీఐజే నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
2021 మే నెల తర్వాత ఇజ్రాయెల్-గాజా మధ్య చోటు చేసుకొన్న అత్యంత హింసాత్మక ఘటనలు ఇవే. నాడు జరిగిన హింసలో 200 మంది పాలస్తీనా వాసులు, 12 మందికిపైగా ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ దళాలు బ్రేకింగ్డౌన్ పేరిట ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇది సుమారు వారం రోజులకు పైగా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జరిగిన ఆపరేషన్లో రఫాలోని పీఐజే సీనియర్ నాయకుడు ఖలీద్ మన్సూర్ ఇంటిని ధ్వంసం చేశారు. గతంలో ఖలీద్ను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ దళాలు దాదాపు ఐదు సార్లు ప్రయత్నించగా తప్పించుకొన్నాడు. గాజాలో మిలిటెంట్ ఆపరేషన్లకు ఇతడే బాధ్యుడని భావిస్తున్నారు. తాజా దాడిలో అతడిని ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఇక వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ దళాలు వేర్వేరు దాడులు నిర్వహించి 19 మంది పీఐజే సభ్యులను అదుపులోకి తీసుకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.