China: వారి పేర్లను చైనా వాడేసింది..!
హిందూ మహాసముద్రంలో చైనా బలాన్ని బాగా పెంచి చూపించుకొంటోంది. అది నిర్వహించిన ఓ కార్యక్రమానికి కొన్ని దేశాలు హాజరు కాలేదు. కానీ, ఆయా దేశాల్లో అధికారం కోల్పోయి ఖాళీగా ఉన్న నేతలు పాల్గొన్నారు. వారినే ఆయా దేశాల ప్రతినిధులంటూ డ్రాగన్ ప్రచారం చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: అంతర్జాతీయ సంబంధాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేది అధికారంలో ఉన్న నేతలు, రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు. అంతేగానీ ప్రైవేటు వ్యక్తులు కాదు. ఈ విషయం చైనాకు స్పష్టంగా తెలుసు. కానీ, పదవి పోయి ఖాళీగా ఉన్న నేతలు వ్యక్తిగత హోదాలో చైనా కార్యక్రమాల్లో పాల్గొన్నా.. వారిని ఆయా దేశ ప్రతినిధులుగా ప్రచారం చేసుకుంటోంది. తాజాగా క్వాడ్కు పోటీగా డ్రాగన్ నిర్వహించిన ఇండియన్ ఓషన్ రీజియన్ ఇనీషియేటివ్ కార్యక్రమం విషయం ఇలానే చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
చైనా ఆధ్వర్యంలో నవంబర్ 21న నిర్వహించిన ‘ఇండియన్ ఓషన్ రీజియన్ ఇనీషియేటివ్’ కార్యక్రమంలో 19 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు డ్రాగన్ వెల్లడించింది. తాము నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా, మాల్దీవుల ప్రతినిధులు పాల్గొన్నారంటూ ఇటీవల ‘ది చైనా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కోపరేషన్ ఏజెన్సీ’ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ, తమ దేశాల ప్రతినిధులు హాజరుకాలేదని ఆ రెండు దేశాలు తెగేసి చెప్పాయి.
ఈ అంశంపై మాల్దీవులు ఆదివారం స్పందిస్తూ ఓ వివరణ జారీ చేసింది. ‘‘మా విదేశాంగ శాఖ ఓ విషయంలో స్పష్టతను ఇవ్వదలుచుకొంది. ఇండియన్ ఓషన్ రీజియన్ ఇనీషియేటివ్లో మా ప్రతినిధులు పాల్గొనలేదు. తాము పాల్గొనబోమన్న విషయాన్ని మాల్దీవుల్లోని చైనా దౌత్యకార్యాలయానికి నవంబర్ 15వ తేదీనే తెలియజేశాం. మాల్దీవుల పౌరులో, ప్రైవేటు బృందమో దీనిలో పాల్గొంటే వారు దేశానికి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినట్లు కాదు’’ అని పేర్కొంది.
మరోవైపు భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫెర్రల్ ట్విటర్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా విరుద్ధమైనవి. కున్మింగ్లో నిర్వహించిన ఇండియన్ ఓషన్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు ఎవరూ పాల్గొనలేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మంత్రుల స్థాయిలో ఏకైక ఫోరమ్ అయిన ‘‘ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్’కు ఎంపీ టిమ్ వాట్స్ హాజరయ్యారు. దానికి వైస్ఛైర్మన్ హోదా కోసం భారత్ చేసుకొన్న దరఖాస్తును ఆమోదించాం’’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ కార్యక్రమానికి మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ హసన్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రడ్డ్ వర్చువల్గా హాజరయ్యారు. అధికారంలో లేని వారిని ఆయా దేశాల అధికారిక ప్రతినిధుల జాబితాలోకి చైనా చేర్చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM