China: వారి పేర్లను చైనా వాడేసింది..!
హిందూ మహాసముద్రంలో చైనా బలాన్ని బాగా పెంచి చూపించుకొంటోంది. అది నిర్వహించిన ఓ కార్యక్రమానికి కొన్ని దేశాలు హాజరు కాలేదు. కానీ, ఆయా దేశాల్లో అధికారం కోల్పోయి ఖాళీగా ఉన్న నేతలు పాల్గొన్నారు. వారినే ఆయా దేశాల ప్రతినిధులంటూ డ్రాగన్ ప్రచారం చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: అంతర్జాతీయ సంబంధాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేది అధికారంలో ఉన్న నేతలు, రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు. అంతేగానీ ప్రైవేటు వ్యక్తులు కాదు. ఈ విషయం చైనాకు స్పష్టంగా తెలుసు. కానీ, పదవి పోయి ఖాళీగా ఉన్న నేతలు వ్యక్తిగత హోదాలో చైనా కార్యక్రమాల్లో పాల్గొన్నా.. వారిని ఆయా దేశ ప్రతినిధులుగా ప్రచారం చేసుకుంటోంది. తాజాగా క్వాడ్కు పోటీగా డ్రాగన్ నిర్వహించిన ఇండియన్ ఓషన్ రీజియన్ ఇనీషియేటివ్ కార్యక్రమం విషయం ఇలానే చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
చైనా ఆధ్వర్యంలో నవంబర్ 21న నిర్వహించిన ‘ఇండియన్ ఓషన్ రీజియన్ ఇనీషియేటివ్’ కార్యక్రమంలో 19 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు డ్రాగన్ వెల్లడించింది. తాము నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా, మాల్దీవుల ప్రతినిధులు పాల్గొన్నారంటూ ఇటీవల ‘ది చైనా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కోపరేషన్ ఏజెన్సీ’ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ, తమ దేశాల ప్రతినిధులు హాజరుకాలేదని ఆ రెండు దేశాలు తెగేసి చెప్పాయి.
ఈ అంశంపై మాల్దీవులు ఆదివారం స్పందిస్తూ ఓ వివరణ జారీ చేసింది. ‘‘మా విదేశాంగ శాఖ ఓ విషయంలో స్పష్టతను ఇవ్వదలుచుకొంది. ఇండియన్ ఓషన్ రీజియన్ ఇనీషియేటివ్లో మా ప్రతినిధులు పాల్గొనలేదు. తాము పాల్గొనబోమన్న విషయాన్ని మాల్దీవుల్లోని చైనా దౌత్యకార్యాలయానికి నవంబర్ 15వ తేదీనే తెలియజేశాం. మాల్దీవుల పౌరులో, ప్రైవేటు బృందమో దీనిలో పాల్గొంటే వారు దేశానికి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినట్లు కాదు’’ అని పేర్కొంది.
మరోవైపు భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫెర్రల్ ట్విటర్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా విరుద్ధమైనవి. కున్మింగ్లో నిర్వహించిన ఇండియన్ ఓషన్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు ఎవరూ పాల్గొనలేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మంత్రుల స్థాయిలో ఏకైక ఫోరమ్ అయిన ‘‘ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్’కు ఎంపీ టిమ్ వాట్స్ హాజరయ్యారు. దానికి వైస్ఛైర్మన్ హోదా కోసం భారత్ చేసుకొన్న దరఖాస్తును ఆమోదించాం’’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ కార్యక్రమానికి మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ హసన్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రడ్డ్ వర్చువల్గా హాజరయ్యారు. అధికారంలో లేని వారిని ఆయా దేశాల అధికారిక ప్రతినిధుల జాబితాలోకి చైనా చేర్చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ