Monkeypox: కేవలం స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్ వ్యాపిస్తుందా..?
ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోన్న మంకీపాక్స్ (Monkeypox) వైరస్ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే (Sexual Contact) వ్యాపించదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ ఏమన్నారంటే
దిల్లీ: ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోన్న మంకీపాక్స్ (Monkeypox) వైరస్ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే (Sexual Contact) వ్యాపించదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ (Sowmya Swaminathan) పేర్కొన్నారు. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వల్లే ప్రధానంగా ఇది వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యక్తి శరీరం, నోరు, ముఖాన్ని తాకడంతోపాటు నోటి తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇది స్వలింగ సంపర్కుల్లోనే (Bi Sexuality) తొలుత బయటపడినప్పటికీ.. తల్లి నుంచి పిల్లలకు, కుటుంబ సభ్యుల్లో వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాప్తిచెందే ఆస్కారం ఉందన్నారు. ప్రపంచ దేశాలతోపాటు భారత్లోనూ మంకీపాక్స్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. ‘ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ వివరాలు వెల్లడించారు.
కరోనా వైరస్తో మంకీపాక్స్తో పోల్చలేమని.. అయినప్పటికీ ప్రస్తుతం మంకీపాక్స్ తీవ్రత తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. మంకీపాక్స్పై ఇప్పటివరకు ఉన్న సమాచారం తక్కువేనని.. వైరస్లో మార్పులు, ప్రాబల్యానికి సంబంధించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 16వేల కేసులు నమోదైనప్పటికీ ఐదు మరణాలు మాత్రమే సంభవించిన విషయాన్ని గుర్తించారు. అయితే, గుర్తించని కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఇక మంకీపాక్స్ కూడా స్మాల్పాక్స్ (Smallpox) మాదిరి వైరస్ అని.. అయితే, తొలితరం వ్యాక్సినేషన్ వల్ల 1978-80 నాటికే స్మాల్ఫాక్స్ నిర్మూలించబడిందన్నారు. 1980 తర్వాత జన్మించిన తరం స్మాల్పాక్స్ వ్యాక్సిన్ తీసుకోలేదని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గుర్తుచేశారు. దీంతో ఆ వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధకత కూడా లేదనే చెప్పవచ్చన్నారు. ఇటువంటి నేపథ్యంలో మంకీపాక్స్ మనకొక మేల్కొలుపు అని అన్నారు. ఇదే సమయంలో మంకీపాక్స్తో పాటు ఆయా దేశాల్లో స్మాల్పాక్స్కు సంబంధించి ఉన్న పూర్తి సమాచారం కూడా సేకరించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!