Donald Trump: పుతిన్ సహాయం కోరిన డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయం కోరారు. జో బైడెన్ కుటుంబాన్ని నష్టపరిచే ఎటువంటి సమాచారమున్నా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
బైడెన్ కుటుంబాన్ని నష్టపరిచే సమాచారాన్ని కోరిన అమెరికా మాజీ అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయం కోరారు. జో బైడెన్ కుటుంబాన్ని నష్టపరిచే ఎటువంటి సమాచారమున్నా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రష్యా సంపన్నుల (ఒలిగార్క్)తో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్కు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలన్నారు. ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో బైడెన్ కుటుంబం లక్ష్యంగా చేసుకొని డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు.
‘పుతిన్ ఇప్పుడు మన దేశానికి అభిమాని కాదు. అయినప్పటికీ ఆయన నుంచి ఓ సమాచారం కోరుతున్నా. మాస్కో మేయర్ భార్య బైడెన్లకు 3.5మిలియన్ డాలర్లు ఎందుకిచ్చినట్లు..? ఈ ప్రశ్నకు పుతిన్ దగ్గర సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఆ విషయం మనకు తెలియాలి’ అంటూ ఓ అమెరికన్ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా రష్యాతో హంటర్ బైడెన్కు వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన ఆయన.. ఆ వివరాలను పుతిన్ బయటకు చెప్పాలన్నారు.
ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న దురాక్రమణను తీవ్రంగా పరిగణిస్తోన్న అమెరికా ఇప్పటికే పలు ఆంక్షలను విధించింది. ఇటీవల ఐరోపాలో పర్యటించిన అధ్యక్షుడు జో బైడెన్.. పుతిన్ వ్యవహార తీరుపై మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన ఒక కసాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని రష్యా అధ్యక్ష భవనం కూడా ఖండించింది. బైడెన్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ పుతిన్కు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇలా రష్యా-అమెరికా దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ అధ్యక్షుడి కుటుంబాన్ని డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకోని పుతిన్ సహాయం కోరడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!