Trump Twitter: మస్క్ కీలక నిర్ణయం.. ట్రంప్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ
Trump Twitter: ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్ ఖాతాను పునురద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ట్విటర్లో పోల్ నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ట్విటర్లో పోల్ నిర్వహించిన తర్వాత ఆయన ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు. ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. పాత సందేశాలతో కూడిన ఆయన ట్విటర్ ఖాతా ప్రస్తుతం సామాజిక మాధ్యమ వేదికపై కనిపిస్తోంది.
ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని మస్క్ పోల్ నిర్వహించారు. దీనికి 15 లక్షలకు పైగా మంది తమ స్పందనను తెలియజేశారు. వీరిలో 51.8 శాతం మంది పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారు. మరో 48.2 శాతం యూజర్లు వద్దని తెలిపారు. కానీ మెజారిటీ మంది పునరుద్ధరణకు మొగ్గుచూపడంతో మస్క్ ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రజల తీర్పే దైవ నిర్ణయం’ అని అర్థం వచ్చే లాటిన్ సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు’’ అంటూ 2021, జనవరి 8న ట్రంప్ చేసిన చివరి ట్వీట్తో ప్రస్తుతం ఆయన ఖాతా కనిపిస్తోంది.
2020 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక అప్పుడు ట్విటర్లో ఉన్న న్యాయ నిపుణురాలైన భారతీయ అమెరికన్ విజయ గద్దె కీలక పాత్ర పోషించారు. మరింత హింస జరగకుండా ఉండేందుకే ట్రంప్ ట్విటర్ ఖాతా రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ఆమె వివరణ ఇచ్చారు. ట్విటర్ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా విజయ గద్దెను ఆయన తొలగించిన విషయం తెలిసిందే.
మస్క్ పోల్పై ట్రంప్ శనివారం రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో స్పందించారు. పోల్ను స్వాగతించిన ఆయన మస్క్ అంటే తనకు ఇష్టమని చెప్పారు. అయితే, తిరిగి ట్విటర్లో క్రియాశీలకంగా మారడంపై మాత్రం పరోక్షంగా విముఖత వ్యక్తం చేశారు. తనకు ‘ట్రుత్ సోషల్’ అనే సొంత సామాజిక మాధ్యమం ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. పైగా ట్విటర్కు తిరిగి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్