Donald Trump: పుతిన్ చాలా మారిపోయాడు.. నేనే ఉండుంటే..!: ట్రంప్
ఉక్రెయిన్పై రష్యా నిజంగానే దురాక్రమణకు పాల్పడడం తనను ఎంతగానో ఆశ్చర్య పరిచిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా నిజంగానే దురాక్రమణకు పాల్పడడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సైనికచర్య పేరుతో బలగాలను ఉక్రెయిన్ సరిహద్దులకు పంపిస్తుంటే కేవలం చర్చలు జరిపేందుకేనని భావించానని అన్నారు. కానీ, చివరకు ఉక్రెయిన్ ఆక్రమణకు పాల్పడడం తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ పుతిన్ ఎంతగానో మారిపోయాడని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
‘నేను నిజంగా ఆశ్చర్యపోయాను. రష్యా బలగాలను ఉక్రెయిన్ సరిహద్దులకు చేరవేస్తుంటే కేవలం చర్చల కోసమే అని భావించా. అంతేకాకుండా ఒక మంచి ఒప్పందం కోసం పుతిన్ ప్రయత్నిస్తున్నారని అనుకున్నా. కానీ, పుతిన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇది ప్రపంచానికి బాధాకరమైన విషయం. పుతిన్ చాలా మారిపోయాడు’ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ అనే వార్తా మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాను అమెరికా అధ్యక్ష పదవిలో ఉంటే, ఉక్రెయిన్ దురాక్రమణ జరిగి ఉండేది కాదన్నారు.
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దురాక్రమణపై యావత్ ప్రపంచం కన్నెర్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్యా దాడులను వెంటనే ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరిస్తుండడంతోపాటు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధిస్తూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో వ్లాదిమిర్ పుతిన్ను డొనాల్ట్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పుతిన్తో ట్రంప్ వ్యవహరించిన తీరుపైనా గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదిలాఉంటే, రష్యా చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్ నగరాలు వణికిపోతున్నాయి. ఓవైపు వేల మంది ఇరు దేశాల సైనికులు, మరోవైపు ఉక్రెయిన్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పోరాటంలో ఇప్పటివరకు దాదాపు 13 వేలకు పైగా రష్యా సైన్యం మృతిచెందినట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఇలా రష్యా చేస్తున్న దండయాత్రతో లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్