Donald Trump: పుతిన్తో మాట్లాడేందుకు అమెరికాకు ఎవ్వరూ లేరు..!
రష్యా దాడులతో ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
బైడెన్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: రష్యా దాడులతో ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాలనా యంత్రాంగమే కారణమన్న ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడేందుకు అమెరికాకు ఎవ్వరూ లేరని విమర్శలు గుప్పించారు. దక్షిణ కరోలినా ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇంకా మార్గాలున్నాయని చెప్పారు.
‘పిరికితనం, అసమర్థత వంటి బలహీనతలు బైడెన్కు ఉన్నప్పటికీ ఈ భయంకరమైన యుద్ధంలో అమెరికన్లు చిక్కుకోకుండా ఉక్రెయిన్ విషాదానికి ముగింపు పలికేందుకు ఇంకా మార్గాలున్నాయి. ఇదే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యాకు దీటుగా అమెరికా స్పందించాలని సూచించిన ఆయన.. రష్యా ఇంధన వనరులపై పశ్చిమదేశాలు శాశ్వతంగా ఆధారపడకుండా చేయడం వల్ల కలిగే పరిణామాలను తెలియజేస్తూ మాస్కోను బెదిరించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడితో మాట్లాడేందుకు అమెరికాకు ఎవ్వరూ లేరన్న ట్రంప్.. తన వ్యక్తిత్వమే యుద్ధం నుంచి అమెరికాను దూరంగా ఉంచిందని ఉద్ఘాటించారు.
ఇదిలాఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దండయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పలు నగరాలను హస్తగతం చేసుకున్న రష్యా సేనలు.. ఉక్రెయిన్ నగరాలను తీవ్ర స్థాయిలో ధ్వంసం చేస్తున్నాయి. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్న్స్కీ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్తో మాట్లాడిన ఆయన.. జెరుసలెంలో పుతిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.