Ukraine Crisis: రైల్వే స్టేషన్ల వద్ద దూకుడు ప్రదర్శించొద్దు: భారతీయులకు సూచనలు
రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్లో పెను సంక్షోభం నెలకొన్న వేళ అక్కడ చిక్కుకొని అవస్థలు పడుతున్న భారతీయులు/విద్యార్థులకు ఆ దేశంలోని భారత రాయబార...
కీవ్: రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్లో పెను సంక్షోభం నెలకొన్న వేళ అక్కడ చిక్కుకొని అవస్థలు పడుతున్న భారతీయులు/విద్యార్థులకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. కీవ్లో విధించిన వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేశారనీ.. విద్యార్థులంతా రైల్వేస్టేషన్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు అక్కడి భారతీయ పౌరులంతా రైల్వే స్టేషన్కు వెళ్లాలన్నారు. విద్యార్థులను తరలించేందుకు ఉక్రెయిన్ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. డ్నిప్రో ఎడమ వైపున చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం, మెట్రోలు, బస్సులు పనిచేస్తున్నాయనీ.. వీటి ద్వారా రైల్వేస్టేషన్కు చేరుకోవచ్చని సూచించారు. అంతా సంయమనంతో ఉండాలని, రైల్వేస్టేషన్ వద్ద దూకుడుగా వ్యవహరించరాదని ట్విటర్లో సూచించింది.
‘‘భారత పౌరులంతా శాంతియుతంగా, ఐక్యంగా ఉండాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైల్వే స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల భారతీయు విద్యార్థులంతా ఓపికతో ఉండాలి. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్లో దూకుడుగా ప్రవర్తించవద్దు. కొన్ని సందర్భాల్లో రైళ్లు ఆలస్యమైనా, ఒకవేళ రద్దయినా భారీ క్యూలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పౌరులంతా తమ పాస్పోర్టును వెంటే ఉంచుకోవాలి. దీంతో పాటు సరిపడా డబ్బులు, తినేందుకు సిద్ధంగా ఉండే భోజనం, సులువుగా అందుబాటులో ఉండే శీతాకాల దుస్తులు, అవసరమైన వస్తువులను మీతో ఉంచుకోండి. ఈ క్లిష్ట సమయంలో కూడా ఉక్రెయిన్ అధికారులు, పౌరులూ భారతీయుల తరలింపు ప్రక్రియకు విశేష మద్దతు ఇస్తున్నారు. దీన్ని మనమంతా గౌరవించాలి’’ అని ఎంబసీ ప్రకటనలో పేర్కొంది.
ఆరు విమానాల్లో 1396మందిని తరలించాం: కేంద్రం
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్లో భయానక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు విద్యార్థులంతా ఆ దేశ సరిహద్దు దేశాలైన హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్ వంటి దేశాలకు చేరుకుంటుండగా..అక్కడి నుంచి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరిట వారిని స్వదేశానికి తరలిస్తోంది. ఈ ఉదయం 249మంది భారతీయులతో ఐదో విమానం రొమానియాలోని బుకారెస్ట్ నుంచి దిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. అలాగే, ఆరో విమానం హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో దిల్లీకి చేరుకుంది. దీంతో ఇప్పటివరకు ఆరు విమానాల్లో 1396 మందిని తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య