కరవు కోరల్లో ఇంగ్లాండ్.. ఖాళీగా రిజర్వాయర్లు.. నీటి వాడకంపై ఆంక్షలు
ఇంగ్లాండ్ కరవుతో (Drought) కటకటలాడుతోంది. చాలా ప్రాంతాల్లో ఈఏడాది తీవ్ర లోటు వర్షపాతం నమోదయ్యింది. పరిస్థితులను సమీక్షించిన అధికారులు ఇంగ్గాండ్లోని (England) చాలా ప్రాంతాల్లో కరువు ప్రకటించారు.
లండన్: ఇంగ్లాండ్ కరవుతో (Drought) కటకటలాడుతోంది. చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది తీవ్ర లోటు వర్షపాతం నమోదయ్యింది. దీంతో ప్రధాన నదుల్లో ప్రవాహం తగ్గిపోతుండగా రిజర్వాయర్లు కూడా ఎండిపోతున్నాయి. పరిస్థితులను సమీక్షించిన అధికారులు ఇంగ్గాండ్లోని (England) చాలా ప్రాంతాల్లో కరవు ప్రకటించారు. కెంట్ అండ్ సౌత్ లండన్, హెర్ట్స్ అండ్ నార్త్ లండన్, థేమ్స్, ఈస్ట్ మిడ్ల్యాండ్స్, సోలెంట్ అండ్ సౌత్ డౌన్స్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో కరవును ప్రకటించగా.. త్వరలోనే మిగతా ప్రాంతాలు కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, గడిచిన యాభై ఏళ్లగా ఈ స్థాయిలో వేసవి కాలం ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని నెలలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఇంగ్లాండ్లో.. వేసవి తాపానికి రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి. జులై నాటికి ఇంగ్లాండ్లో ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యంలో కేవలం 65శాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పంటల విస్తీర్ణం కూడా తగ్గిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్యారెట్, ఉల్లి, షుగర్ బీట్, యాపిల్ పంటల సాగు దాదాపు 10 శాతం నుంచి 50శాతం నష్టపోతుందని అంచనా. మరోవైపు ఆహారంలేమితో పశువులు అల్లాడుతున్నాయని.. దీని ప్రభావం పాల ఉత్పత్తులపైనా పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొనడంతో సమీక్షించిన అధికారులు నీటి పొదుపు చర్యలకు ఉపక్రమించారు.
ఈ నేపథ్యంలో అనేక నగరాల్లో కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన ఇంగ్లాండ్ అధికారులు.. అక్కడ నీటి వాడకంపై ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా గొట్టపు పైపుల ద్వారా ట్యాప్ వాటర్తో కార్లను కడగడంపై నిషేధంతో పాటు వాహనాలు, భవనాలు, కిటికీలను శుభ్రపరచడానికి స్ప్రింక్లర్లను ఉపయోగించకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఇంగ్లాండ్లో నెలకొన్న కరవు పరిస్థితులు అక్కడి ఆహార ఉత్పత్తులపైనా పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళా దుంపతోపాటు మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు