Nepal: నేపాల్ నుంచి దుబాయ్ బయలుదేరిన విమానం ఇంజిన్లో మంటలు
నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి 150 మంది ప్రయాణికులతో దుబాయ్కు చెందిన విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక ఇంజిన్లో మంటలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మరో ఇంజిన్కు బదలాయించడంతో అన్ని ఇండికేటర్లు సాధారణంగానే ఉన్నాయని పైలట్లు కంట్రోల్ టవర్కు సమాచారం అందించారు.
ఖఠ్మాండ్: నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి 150 మంది ప్రయాణికులతో దుబాయ్ బయలుదేరిన విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దుబాయ్కు చెందిన ఫ్లైదుబాయ్ విమానం కాఠ్మాండూలోని త్రిభువన్దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాని రెండు ఇంజిన్లలో ఒకదాంట్లో మంటలు చెలరేగినట్లు విమానాశ్రయ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని తక్షణం ల్యాండ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అయితే అన్ని ఇండికేటర్లు సాధారణంగా ఉన్నాయని, విమానం గమ్యస్థానం దిశగా సాగుతున్నట్లు పైలట్లు కంట్రోల్ టవర్కు సమాచారం అందించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘కాఠ్మాండూ నుంచి దుబాయ్ బయలు దేరిన ‘ఫ్లైదుబాయ్ 576’ విమానం ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా తన గమ్యస్థానం దిశగా వెళుతోంది. కాఠ్మాండూ విమానాశ్రయ కార్యకలాపాలు ఇప్పుడు సాధారణంగానే ఉన్నాయి’’ అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. ‘‘సమస్య ఏర్పడిన ఇంజిన్ను కాసేపటి తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మరో ఇంజిన్కు బదలాయించారు. ప్రస్తుతం విమానం కాఠ్మాండూ విమానాశ్రయంలో దిగకుండానే గమ్యస్థానం దిశగా ప్రయాణం సాగిస్తోంది’’ అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ పేర్కొన్నారు. విమానాశ్రయం నుంచి దుబాయి విమానం సోమవారం రాత్రి 9.20 గంటలకు బయలుదేరింది. విమానంలో 150 మంది ఉండగా వారిలో సుమారు 50 మంది నేపాల్ ప్రయాణికులు కాగా, మిగతావారు ఇతర దేశాలకు చెందినవారు. ఇంజిన్లో మంటలు చెలరేగిన విషయం తెలియగానే ఉత్కంఠ చెలరేగింది. అత్యవసర ల్యాండింగ్ కోసం అధికారులు చర్యలు చేపట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు