బర్గర్ స్థానంలో పానీపూరీ వస్తుందా..? ప్రవాసుల ప్రశ్నకు జైశంకర్ సమాధానమిదే..!
పాశ్చాత్య దేశస్థులు బర్గర్కు బదులుగా పానీపూరీ తినే రోజులు వస్తాయా అని ఓ ప్రవాసాంధ్రుడు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar)ను ప్రశ్నించారు. దీనికి ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు.
స్టాక్హోం: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) గత ఇటీవల స్వీడన్ (Sweden )లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన ప్రవాస భారతీయుల (Indian diaspora)తో ముచ్చటించారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి ప్రపంచీకరణ (globalisation of the Indian culture) గురించి ప్రవాసులు అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు.
స్వీడన్లో జరిగిన ఈయూ ఇండో-పసిఫిక్ మంత్రిత్వస్థాయి సదస్సుకు జైశంకర్ (S Jaishankar) హాజరయ్యారు. పర్యటన మధ్యలో ప్రవాస భారతీయులతో ఆయన ఓ చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్లో వచ్చిన సంస్కరణలు, విదేశాల్లో ఉన్న భారతీయులకు ఉన్న అవకాశాలపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ప్రపంచీకరణ గురించి జైశంకర్ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘‘పాశ్చాత్య దేశస్థులు హాంబర్గర్కు బదులుగా పానీపూరీ తినే రోజులు వస్తాయా? New York అనే పేరుకు బదులుగా New Delhi అనే ప్రింట్ ఉండే టీషర్టులను చూస్తామా?’’ అని ప్రశ్నించారు.
దీనికి జైశంకర్ (S Jaishankar) బదులిస్తూ.. ‘‘మీరు చెప్పినవన్నీ త్వరలోనే నిజమవ్వాలని ఆశిద్దాం. అది జరిగితే మీ నోరు తీపిచేస్తాను’’ అని చెప్పడంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టారు. అనంతరం విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ‘‘భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం మనం ఇప్పుడిప్పుడే చూడటం మొదలుపెడుతున్నాం. ఇందుకు పలు కారణాలున్నాయి. ఒకటి ప్రవాసభారతీయులు విశ్వమంతా ఉండటం. రెండోది మన ఆత్మవిశ్వాసం పెరగడం. దీనికి ఓ మంచి ఉదాహరణ చెబుతాను. 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించింది. ఇప్పుడు అది ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పుడు యోగాపై ఉత్సాహం చూపించని దేశం లేదంటే అతిశయోక్తి కాదు’’ అని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?