సంక్షిప్త వార్తలు(3)
ఉక్రెయిన్కు మిగ్-29 యుద్ధవిమానాలందించేందుకు ముందుకొచ్చిన స్లోవేకియాకు ప్రతిఫలంగా 12 నూతన సైనిక హెలికాప్టర్లను అందిస్తామని అమెరికా ప్రకటించింది.
స్లోవేకియాకు అమెరికా హెలికాప్టర్లు
ఉక్రెయిన్కు యుద్ధవిమానాలిచ్చినందుకు ప్రతిఫలం
బ్రాటిస్లావా: ఉక్రెయిన్కు మిగ్-29 యుద్ధవిమానాలందించేందుకు ముందుకొచ్చిన స్లోవేకియాకు ప్రతిఫలంగా 12 నూతన సైనిక హెలికాప్టర్లను అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని స్లోవేకియా రక్షణ మంత్రి జరోస్లావ్ నాద్ బుధవారం వెల్లడించారు. ఆ ప్రకారం మొత్తం బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో బెల్ ఏహెచ్-1జడ్ పోరాట హెలికాప్టర్ల కోసం 340 మిలియన్ డాలర్లను అమెరికాకు స్లోవేకియా చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం మేరకు 500 ఏజీఎం-114 హెల్ఫైర్ 11 క్షిపణులతో పాటు శిక్షణనూ అమెరికా అందిస్తుంది. ఒప్పందంలో మిగిలిన 660 మిలియన్ డాలర్లను అమెరికా విదేశీ సైనిక సాయం కింద సర్దుబాటు అవుతుందని నాద్ వివరించారు. అదేవిధంగా స్లోవేకియాకు యూరోపియన్ యూనియన్ కూడా పరిహారంగా 213 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించనుంది. ఈ ప్రతిపాదనలను స్లోవేకియా ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. తమ ఆయుధాగారం నుంచి 13 సోవియట్ యూనియన్ తయారీ మిగ్-29 యుద్ధవిమానాలను ఉక్రెయిన్కు అందించాలని స్లోవేకియా ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అత్యున్నత అధికారి హతం..
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐలో రెండో అత్యున్నత అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఐఎస్ఐలో బ్రిగేడియర్ హోదాలో పనిచేస్తున్న ముస్తఫా కమాల్ బార్కీ ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది. దక్షిణ వజీరిస్థాన్లోని అంగూర్ అడ్డలో ఈ ఘటన చోటుచేసుకొన్నట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. ఈ ఎన్కౌంటర్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముస్తఫా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు పాక్ పేర్కొంది.
ముస్తఫా మృతికి పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లిస్తారన్నారు. మరోవైపు పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ఖాన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
క్రూయిజ్ క్షిపణులను మోహరిస్తున్న ఉత్తర కొరియా
సియోల్: దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తర కొరియా సైతం ఆయుధ పరీక్షలను ముమ్మరం చేసింది. మూడు రోజుల క్రితం డమ్మీ అణ్వాయుధాన్ని పరీక్షించిన కిమ్ సేనలు.. బుధవారం క్రూయిజ్ క్షిపణులను పరీక్షించాయి. ఈశాన్య తీర పట్టణం హమ్హంగ్లో ఉత్తర కొరియాలోని ఈ క్షిపణులను ప్రదర్శించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై ఐరాస ఆంక్షలు విధించింది. క్రూయిజ్ క్షిపణి పరీక్షలపై నిషేధం లేదు. ఉత్తరకొరియా కొన్ని క్రూయిజ్, ఖండాంతర క్షిపణులను వ్యూహాత్మక ఆయుధాలుగా పేర్కొంటోంది. వీటికి అణ్వాయుధాలను జోడించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 11 రోజుల దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. తర్వాత సైతం దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు కొనసాగించేందుకు అమెరికా విమాన వాహక యుద్ధనౌకను ఇక్కడకు పంపే అవకాశం ఉందని ఉత్తరకొరియా అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ సేనలు క్షిపణి పరీక్షలను కొనసాగించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. -
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు