Mental Health: కొవిడ్తో వారిలో మానసిక సమస్యలు రెండింతలు ఎక్కువ!
సాధారణ వయోవృద్ధులతో పోలిస్తే.. కొవిడ్(Covid) బారిన పడినవారిలో కుంగుబాటు(Depression), ఆందోళన(Anxiety) తదితర మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ..
తాజా అధ్యయనంలో వెల్లడి
ఇంటర్నెట్ డెస్క్: సాధారణ వయోవృద్ధులతో పోలిస్తే.. కొవిడ్(Covid) బారిన పడినవారిలో కుంగుబాటు(Depression), ఆందోళన(Anxiety) తదితర మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులూ చుట్టుముడతాయనీ అంచనా వేసింది. అమెరికాకు చెందిన పీఎన్ఏఎస్(PNAS) జర్నల్లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై కరోనా తక్షణ, దీర్ఘకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకుగానూ 52- 74 ఏళ్ల మధ్య వయస్సు గల 5,146 మంది వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇందులో పాల్గొన్న వారు కరోనాకు ముందు, వైరస్ ఉద్ధృత దశ సమయంలో రెండుసార్లు తమ వివరాలు అందజేశారు.
ఈ అధ్యయనం ప్రకారం.. 2020 మధ్యకాలంలో కరోనా సోకని 22 శాతం మందితో పోలిస్తే.. కొవిడ్ సోకినట్లు భావిస్తోన్న వారిలో 49 శాతం మంది కుంగుబాటు లక్షణాలు కలిగి ఉన్నారని తేలింది. మహమ్మారి లేనివారిలో ఆరు శాతంతో పోలిస్తే.. వైరస్ బారిన పడినవారిలో 12 శాతం మందిలో ఆందోళన ఉందని వెల్లడైంది. అదే ఏడాది చివర్లో నిర్వహించిన కొనసాగింపు సర్వే ప్రకారం.. కరోనా సోకిన వృద్ధుల్లో కుంగుబాటు, ఆందోళన లక్షణాలు.. ఇతరుల్లోని 33 శాతం, ఏడు శాతంతో పోలిస్తే.. 72 శాతం, 13 శాతంగా ఉన్నాయి. మహమ్మారి సోకనివారిలో 20 శాతంతో పోలిస్తే.. పాజిటివ్గా తేలిన వృద్ధుల్లో 40 శాతం మంది కరోనా ముందు కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిలో ఒంటరి భావన సైతం రెండింతలు పెరిగింది.
‘కరోనా సంక్రమణ.. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత, ఆర్థిక, సామాజిక సంబంధాలపై చూపే ప్రభావంపై ప్రస్తుతం చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. మా అధ్యయనం ప్రకారం.. కొవిడ్ సోకిన వృద్ధులు.. సాధారణ వృద్ధులతో పోలిస్తే.. నిరాశ, ఆందోళన, ఒంటరితనంతో పాటు ఆర్థిక ఇబ్బందులు అనుభవించారు. కరోనా తీవ్ర దశతోపాటు తర్వాతి ఆరు నెలల వరకు ఇవి స్పష్టంగా కనిపించాయి. కొవిడ్ నియంత్రణ చర్యలు, వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు.. మానసిక సమస్యల పెరుగుదలకు కారణం కావచ్చు’ అని ప్రధాన అధ్యయనకర్త, బ్రిటన్లోని లండన్ యూనివర్సిటీ కాలేజ్ (యూసీఎల్)కు చెందిన ఎల్లీ ఐయోబ్ చెప్పారు. ‘వైరస్ ప్రతికూల ప్రభావం.. ప్రజల్లో దీర్ఘకాలం, విస్తృతంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యులను సంప్రదించాల’ని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ