ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. అందులో ఆరుగురు చిన్నారులు
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రం బ్రోకెన్ యారో పట్టణంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది.
బ్రోకెన్ యారో (యూఎస్): అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రం బ్రోకెన్ యారో పట్టణంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం మంటల్లో తగలబడిపోతున్న ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులు సహా 8 మంది అనుమానాస్పద స్థితిలో విగత జీవులుగా కనిపించారు. ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దలు మొదట పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వీరందరినీ ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటికి నిప్పు పెట్టారా అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు బ్రోకెన్ యారో పోలీస్ చీఫ్ బ్రాండన్ బెర్రీహిల్ తెలిపారు. చిన్నారులంతా 1 నుంచి 13 ఏళ్లలోపువారని ఆయన చెప్పారు. ఆ ఇంట్లో నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మృతుల వివరాలను ఆయన వెల్లడించలేదు. వీరు అగ్నిప్రమాదం కారణంగా మరణించినట్లు కనిపించడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. తాను కారులో వెళ్తుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయం గుర్తించానని, ఆ సమయంలో ఇంటి ముందు ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెళ్తూ కనిపించాడని కటెలిన్ పవర్స్ అనే స్థానిక మహిళ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు