Australia: కుదిరితే లైట్లు ఆర్పేయండి..!
బొగ్గు ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషించే ఆస్ట్రేలియా ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. న్యూ సౌత్వేల్స్ రాష్ట్రంలో ప్రజలు
విద్యుత్తు సంక్షోభం అంచున ఆస్ట్రేలియా
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
బొగ్గు ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషించే ఆస్ట్రేలియా ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. న్యూ సౌత్వేల్స్ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఉంటే నిత్యం కొంత సేపు లైట్లు ఆర్పేయమని ఆస్ట్రేలియా ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్ స్వయంగా అభ్యర్థించారు. ఆ రాష్ట్ర ప్రజలు వీలైనంత విద్యుత్తును పొదుపు చేయాలని కోరారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో అవసరం లేని విద్యుత్తు వస్తువుల వినియోగాన్ని నిలిపేయాలని కోరారు. ఆస్ట్రేలియాలో అత్యంత కీలకమైన సిడ్ని నగరంలో కూడా ఇలా చేయాలని కోరడం పరిస్థితికి అద్దంపడుతోంది.
సంక్షోభం ఎందుకు..?
ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు, ఎల్ఎన్జీ ఎగుమతిదారుల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఆ దేశంలో 65శాతం విద్యుత్తును బొగ్గుతోనే ఉత్పత్తి చేస్తారు. మరో 7శాతం ఎల్ఎన్జీ ద్వారా తయారు చేస్తారు. మిగిలినది పునరుత్పాదక ఇంధనం వనరులతో ఉత్పత్తి అవుతుంది. దీంతో ఉద్గారాల తగ్గింపునకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేందని కొన్నాళ్ల నుంచి ఆస్ట్రేలియా విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో బొగ్గు సరఫరాలో తీవ్రమైన అవాంతరాలు తలెత్తాయి. దీంతో బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్లు పెద్ద ఎత్తున ఉత్పత్తిని నిలిపేశాయి. ఫలితంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి. ఆస్ట్రేలియాలో మార్కెట్ విద్యుత్తును ‘ది ఆస్ట్రేలియన్ ఎనర్జీ మార్కెట్ ఆపరేటర్’ (ఏఈఎంవో) నియంత్రిస్తుంది. ఉత్పత్తిదారులు తమ ఖర్చు ఆధారంగా ఇక్కడ ధరను నిర్ణయిస్తారు. ఏఈఎంవో డిమాండ్కు సరిపడా సరఫరా ఉండేట్లు చూసుకొంటారు. బుధవారం ఏఈఎంవో మార్కెట్ను సస్పెండ్ చేసింది. నేరుగా తానే ధరలను నిర్ణయిస్తానని.. ఉత్పత్తి దారులకు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేస్తానని ప్రకటించింది.
బొగ్గు ఉత్పత్తి ఎందుకు తగ్గింది..?
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్, న్యూసౌత్ వేల్స్లో భారీగా వరదలు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు ఎక్కువ. వరదల కారణంగా గనులు, బొగ్గు సరఫరా చేసే రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరఫరాలు లేక బొగ్గుతో ఉత్పత్తి చేసే సామర్థ్యంలో 25శాతం ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. అంటే దాదాపు ఇక్కడ దాదాపు 5 గిగావాట్లకుపైగా ఉత్పత్తి తగ్గిందన్నమాట. ఈ లోటు క్రమంగా పెరుగుతోంది. మరోపక్క వాతావరణ మార్పుల కారణంగా చలిపెరిగిపోవడంతో ఎల్ఎన్జీకి డిమాండ్ పెరిగింది. ఈ కారణాలతో మర్కెట్లో విద్యుత్తు ఖరీదు గణనీయంగా పెరిగి మెగావాట్ అవర్ ధర 300 డాలర్లను దాటేసింది. ఇది మార్కెట్ రెగ్యూలేటర్ ఏఈఎంవో నిర్దేశించిన ధర 100 డాలర్ల నుంచి 200 డాలర్ల కంటే ఎక్కువ. దీంతో బుధవారం ఏఈఎంవో మార్కెట్నే సస్పెండ్ చేసింది.
చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..
ఏఈఎంవో ఈ సస్పెన్షన్ను కచ్చితంగా ఎప్పుడు ఎత్తివేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో నిర్దేశించిన ధరలకు అందుబాటులోకి వచ్చే వరకు ఈ సస్పెన్షన్ ఉంటుందని పేర్కొన్నారు. మరోపక్క ఆస్ట్రేలియాలో అతిపెద్ద విద్యుత్తు తయారీ కర్మాగారం ఏజీఎల్ ఎనర్జీ భవిష్యత్తులో ఉత్పత్తి పెంచుతామని వెల్లడించారు. మరోపక్క ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బాన్సె కూడా రాష్ట్రాల ప్రీమియర్లతో ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధం అయ్యారు.
భారత్పై ప్రభావం..
భారత్లో ఇప్పటికే విద్యుత్తు ఉత్పత్తికి జూన్-సెప్టెంబర్ వరకు పవర్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలను సమీకరించడం కష్టతరంగా మారనుంది. ఇక్కడ కూడా భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి కుంటుపడే అవకాశాలు ఎక్కువ. సెంట్రల్ ఎలక్ట్ర్సిటీ అథారిటీ లెక్కల ప్రకారం 173 పవర్ ప్లాంట్లలో 23.32 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. ఇది వాటి అవసరాల్లో 35శాతానికి మాత్రమే సరిపోతుంది. వీటిల్లో తొమ్మిది ప్లాంట్లు పూర్తిగా విదేశీ బొగ్గుపైనే నడుస్తాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ను అందుకోవడానికి కోల్ ఇండియా రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకోవడానికి యత్నాలు చేస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాలో బొగ్గు సంక్షోభం భారత్పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..