Corona Virus: చైనాలో భయం..భయం.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
కరోనా బాధితులతో చైనాలోని పలు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ప్రీజర్లు సరిపోకపోవడంతో.. మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
బీజింగ్: చైనా (China) లో కరోనా వైరస్ (Corona Virus) మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు బీఎఫ్ 7 (BF 7) వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వ్యాప్తి ప్రధానంగా వయోవృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు అక్కడి వైద్య వర్గాలు వెల్లడించాయి. కొత్తగా నమోదవుతున్న కేసులు అధికం కావడంతో బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.
చాంగ్క్వింగ్ వైద్య విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని మొత్తం రోగుల్లో.. దాదాపు 80 నుంచి 90 శాతం కరోనా బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. వయోవృద్ధులపై ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతో పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే. మృతుల సంఖ్య విషయంలో చైనా నిజాన్ని దాస్తోందన్న అనుమానాలూ ఉన్నాయి. ఆస్పత్రుల్లోని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న పలువురు సిబ్బందికి కూడా ఈ మహమ్మారి సోకుతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరుకావాల్సి వస్తోందంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 10 గంటలకు పైగా విధులు నిర్వర్తించాల్సివస్తోందని అంటున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి చాంగ్క్వింగ్కు వచ్చిన బాధితుల, వారి బంధువుల వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది.
షాంఘైలోని వివిధ ఆస్పత్రులు, అత్యవసర విభాగాలు స్ట్రెచర్లతో నిండిపోయి ఉన్నాయి. చాలా మంది బాధితులకు ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు. చైనా వ్యాప్తంగా ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. లక్షలాది మంది ప్రజలు ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదని రికార్డులు చెబుతున్నాయి. ఇది కూడా కొవిడ్ ఉద్ధృతికి ఓ కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశంలో చోటు చేసుకుంటున్న చాలా మరణాలకు కరోనా వైరస్ కారణం కాదని ఆ దేశం వాదిస్తోంది. ప్రభుత్వ లెక్కల్లో తప్పుగా చూపిస్తోంది. మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా సరిపోవట్లేదని షాంఘై అధికారులు వెల్లడించారు. మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్