Europe: వీధిలోకి వచ్చి కాల్పులు.. 11 మంది మృతి

ఐరోపాలోని మాంటినిగ్రో దేశంలో ఓ వ్యక్తి (34) విచక్షణారహితంగా కాల్పులు జరిపి 11 మందిని పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతను కూడా మృతిచెందాడు. తొలుత కుటుంబంతో తగాదా పడిన దుండగుడు ఒక్కసారిగా

Updated : 13 Aug 2022 08:54 IST

దుండగుడిని మట్టుబెట్టిన పోలీసులు
మాంటినిగ్రోలో ఘటన

సెంటింజ్‌: ఐరోపాలోని మాంటినిగ్రో దేశంలో ఓ వ్యక్తి (34) విచక్షణారహితంగా కాల్పులు జరిపి 11 మందిని పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతను కూడా మృతిచెందాడు. తొలుత కుటుంబంతో తగాదా పడిన దుండగుడు ఒక్కసారిగా రెచ్చిపోయి వీధిలోకి వచ్చి కనిపించిన వారందరిపైనా కాల్పులకు తెగబడ్డాడు. అప్పటికి వీధిలో చిన్నపిల్లలు సహా పలువురు ఉండగా.. వారిలో 11 మంది మృతి చెందారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపడంతో మృతి చెందాడు. మాంటొనెగ్రో రాజధాని పొడొగ్రికాకు 36 కి.మీ.ల దూరంలోని సెంటెంజీ నగరంలో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.  

జైలులో ముఠా తగాదా : 11 మంది మృతి

మెక్సికోలోని జైలులో చోటుచేసుకున్న ముఠా తగాదా, అనంతర హింసాత్మక ఘటనల్లో 11 మంది మృతి చెందారు. నగర సరిహద్దులో ఉన్న జైలులో తొలుత ఓ ముఠా కొట్లాటకు దిగడంతో ఇద్దరు ఖైదీలు చనిపోయారు. విషయం బయటకు రావడంతో పక్కనే ఉన్న సివుదాద్‌ జువారెజ్‌లోని ముఠాలు రెచ్చిపోయి 9 మందిని హతమార్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని