Elon Musk: ‘ప్రపంచాన్ని ఇంటర్నెట్ శాసిస్తుంది’.. 25ఏళ్ల క్రితం మస్క్ చెప్పిన వీడియో వైరల్
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk).. తన వ్యాపార సామ్రాజ్యంలో భారీ అంచనాలతో కూడిన నిర్ణయాలను ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో రెండున్నర దశాబ్దాల క్రితమే ఆయన ఇంటర్నెట్ (Internet) గురించి చెప్పిన ఓ వీడియో వైరల్గా మారింది.
వాషింగ్టన్: ఏ రంగంలో అడుగుపెట్టినా సంచలన నిర్ణయాలతో దూసుకెళ్లే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఆయా రంగాలపై ఎప్పటికప్పుడు తన ముందస్తు అంచనాలను వెలువరుస్తూంటారు. ఇంతటి విజయవంతమైన బిజినెస్మెన్గా ఎదిగేందుకు ఆయనకు ఇవే దోహదపడ్డాయని చెబుతారు. ఈ క్రమంలో ప్రపంచాన్ని ఇంటర్నెట్ (Internet) ఎలా శాసిస్తుందోననే విషయాన్ని 25 ఏళ్ల క్రితమే మస్క్ ఊహించి చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) ప్రస్తుతం వైరల్గా మారాయి.
‘ప్రపంచాన్ని ఇంటర్నెట్ ఎలా శాసిస్తుంది’ అని 1998లో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెస్లా సీఈవో, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. దీనిని టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ సోషల్ నెట్వర్క్ విభాగం ఇటీవల పోస్టు చేసింది. అందులో ఇంటర్నెట్ ప్రభంజనం గురించి ముందుగానే అంచనా వేసిన మస్క్.. ‘ఇది అన్ని మీడియాలను మించిపోతుంది. అన్నిరకాల మాధ్యమాలకూ ముగింపు పలుకుతుంది. ప్రింట్, రేడియో, చర్చలు.. ఇలా అన్ని రకాల అంశాలను ఇంటర్నెట్లోనే చూడొచ్చు. రెండు మార్గాల కమ్యూనికేషన్లో ఇది తొలి అడుగు. వినియోగదారులు తమకు ఏది కావాలో అదే ఎంచుకోవచ్చు. సంప్రదాయ మీడియాలో ఇదో విప్లవం కాబోతుందని అనుకుంటున్నా’ అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ అప్పట్లో చెప్పిన వీడియో క్లిప్ను షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఇప్పటికే 20లక్షల మంది ఆ వీడియో వీక్షించగా వేల కొద్ది లైకులు వచ్చాయి. రెండున్నర దశాబ్దాల క్రితమే ఇంటర్నెట్ విప్లవంపై మస్క్ వేసిన అంచనాలు ఇప్పుడు వాస్తవ రూపంలో చూస్తున్నామంటూ ట్విటర్ యూజర్లు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత