Twitter: అద్దె చెల్లించని ఎలాన్ మస్క్.. ట్విటర్పై దావా
ఇటీవలే ట్విటర్ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్కు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ట్విటర్ ప్రధాన కార్యాలయం అద్దెను కొంతకాలంగా చెల్లించడం లేదట. దీంతో భవన యాజమాన్య సంస్థ కోర్టులో దావా వేసింది.
వాషింగ్టన్: ట్విటర్ (Twitter) కొనుగోలు సమయంలో సంచలన, విమర్శనాత్మక ప్రకటనలతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) నిత్యం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత ఆయనకు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ (Twitter) ప్రధాన కార్యాలయానికే అద్దె చెల్లించడం లేదట. దీంతో న్యాయపరమైన చర్యలు చేపట్టిన భవన యజమాని సంస్థ.. ట్విటర్పై దావా వేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని హార్ట్ఫోర్డ్ బిల్డింగ్ 30వ అంతస్తులో ట్విటర్ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. అయితే, కొంతకాలంగా ప్రధాన కార్యాలయం అద్దెను ట్విటర్ చెల్లించడం లేదని తెలుస్తోంది. అందుకే ఐదు రోజుల్లో ఖాళీ చేయాలని డిసెంబర్ 16నే ట్విటర్కు భవన యాజమాన్యం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకపోవడంతో భవన యజమాని శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ కోర్టును ఆశ్రయించారు. ఎలాన్ మస్క్ (Elon Musk) బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ట్విటర్ ప్రధాన కార్యాలయం అద్దెను చెల్లించడం లేదని దావాలో పేర్కొన్నారు. అద్దె కింద మొత్తంగా 1.36లక్షల డాలర్లు బాకీ పడినట్లు సమాచారం. కేవలం ఇదే కాకుండా చాలా ప్రాంతాల్లో ఉన్న ట్విటర్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
కోర్టులో దావాను ఎదుర్కోవడం ట్విటర్కు కొత్తేమీ కాదు. గతంలోనూ ఛార్టర్ విమానాలకు చెల్లింపులు చేయకపోవడంపైనా కోర్టులో దావా కొనసాగింది. తాజాగా ప్రధాన కార్యాలయ అద్దె బాకీ వ్యవహారంపై యజమాన్య సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ స్పందనగా ట్విటర్ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?