twitter files: సెగలు పుట్టిస్తున్న ట్విటర్ ఫైల్స్.. మరో కీలక ఉద్యోగిపై మస్క్ వేటు
హంటర్ బైడెన్ (Hunter Biden)ల్యాప్టాప్పై 2020లో న్యూయార్క్ పోస్టు ప్రచురించిన కథనం ట్విటర్(Twitter)లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్ : 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన ట్విటర్(Twitter) సీనియర్ ఉద్యోగిపై ఎలాన్ మస్క్(Elon Musk) వేటు వేశారు. జోబైడెన్ (joe biden ) తనయుడు హంటర్ బైడెన్ లీలలపై న్యూయార్క్ పోస్టు ప్రచురించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం కాకుండా ట్విటర్(Twitter) నిలిపేసింది. దీనికి సంబంధించి కంపెనీ వెబ్సైట్ డిప్యూటీ జనరల్ కౌన్సిల్ జేమ్స్ బేకర్పై ఎలాన్ మస్క్(Elon Musk) తాజాగా వేటు వేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ ‘‘ప్రజా చర్చ జరగాల్సిన కీలక అంశాన్ని తొక్కిపెట్టిన విషయంలో బేకర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటం ఆందోళనకరం. అతడు నేడు ట్విటర్ నుంచి వెళ్లిపోయాడు’’ అని పేర్కొన్నారు. 2020 ఎన్నికల్లో బైడెన్కు లబ్ధి చేకూర్చడం కోసమే అప్పట్లో ట్విటర్ (Twitter)ఇలా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. హ్యాక్డ్ మెటీరియల్ పాలసీకి విరుద్ధంగా ఉందని వీటిని అప్పట్లో ట్విటర్ సెన్సార్ చేసింది. కానీ, వీటి పైన రాజకీయ పార్టీలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి ఎటువంటి హెచ్చరికలు లేవు.
హంటర్ బైడెన్ (Hunter Biden) ల్యాప్టాప్ల నుంచి సేకరించిన సమాచారం విడుదలపై గతంలో ట్విటర్లో జరిగిన అంతర్గత సంభాషణలను గత వారం జర్నలిస్ట్ మాట్ టాబీతో కలిసి ఎలాన్ మస్క్ (Elon Musk) విడుదల చేశారు. వీటిని ‘ట్విటర్ ఫైల్స్ 1’గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు మస్క్ వీటి విడుదలపై ప్రకటన చేయడం విశేషం. మాట్ టాబీ ట్విటర్ (Twitter) ఖాతాలో ఈ ఫైల్స్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్టు చేశారు.
హంటర్ ల్యాప్టాప్ ఎలా వచ్చింది..?
అమెరికా డెలావేర్లోని జాన్పౌల్ మాక్ లాసక్ అనే వ్యక్తి నిర్వహించే కంప్యూటర్ రిపేర్ షాప్ వద్దకు 2019 ఏప్రిల్లో కొన్ని ల్యాప్టాప్లు మరమ్మతుల కోసం వచ్చాయి. వాటిపై బీయూ బైడెన్ ఫౌండేషన్ స్టిక్కర్లు ఉన్నాయి. వాటి నుంచి డేటా వెలికి తీయాలని కోరారు. ఆ ల్యాప్టాప్ల మరమ్మతులు పూర్తయ్యాయి. డేటాను కూడా రికవరీ చేశారు. వాటిని మరమ్మతులకు ఇచ్చిన వ్యక్తి మాత్రం మళ్లీ తిరిగి రాలేదు. సొమ్ము కూడా చెల్లించలేదు. వెలికి తీసిన డేటాలో హంటర్ బైడెన్ (Hunter Biden) మత్తుమందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియో క్లిప్లు, మెయిల్స్ వంటివి ఉన్నాయి. ఆ ల్యాప్టాప్ ఇచ్చిన వ్యక్తి హంటర్ బైడెనే(Hunter Biden) అని అర్ధం చేసుకొన్న సదరు వ్యక్తి భయపడిపోయాడు. 2019 డిసెంబర్లో ఎఫ్బీఐ ఆ ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొంది. అప్పటికే అతడు వాటిలోని సమాచారాన్ని కాపీ చేసి ట్రంప్ సన్నిహిత వర్గాల్లోని రూడీ గులియాని న్యాయవాది రాబర్ట్ కొస్టెల్లోకు అప్పజెప్పాడు. గులియాని ఈ హార్డ్డ్రైవ్ను న్యూయార్క్ పోస్టుకు ఇచ్చారు. 2020లో న్యూయార్క్ పోస్టు వీటిని పబ్లిష్ చేసింది. ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అప్పట్లో ట్విటర్(Twitter) ఈ కథనాన్ని సెన్సార్ చేసి.. న్యూయార్క్ పోస్టు ఖాతాను కూడా కొన్నాళ్లు సస్పెండ్ చేసింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించిన సమాచారాన్నే ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా విడుదల చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్