Elon Musk: ఎలాన్ మస్క్.. బాత్రూం వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు..!
ట్విటర్ (Twitter) హెడ్ఆఫీసులో ఇటీవల పరిస్థితులు దారుణంగా మారాయని అక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాన్ మస్క్ (Elon Musk) ఆఫీసుకు వచ్చిన సమయంలో భారీ భద్రత ఉంటుందని.. ఆయన బాత్రూమ్కు వెళ్లిన సమయంలోనూ ఇద్దరు బాడీగార్డులు (Bodyguard) ఆయన వెంటే ఉంటారనే విషయం వెల్లడైంది.
వాషింగ్టన్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ను (Twitter) సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ (Elon Musk).. సంస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు మొదలు కార్యాలయాల్లో వస్తువుల అమ్మకం వంటి చర్యలు కొనసాగిస్తున్నారు. మస్క్ అనూహ్య నిర్ణయాలపై ఆసంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్ (Elon Musk) హెడ్ ఆఫీస్కు వచ్చిన సమయంలో ఎప్పుడూ సెక్యూరిటీ నడుమే ఉంటారని.. బాస్ బాత్రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఫాలో అవుతారని సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి మీడియాకు వెల్లడించారు.
‘ట్విటర్ ఆఫీసుకి ఎలాన్ మస్క్ వస్తే సెక్యూరిటీ సిబ్బంది ఆయన చుట్టే ఉంటారు. కార్యాలయంలో ఎక్కడికి వెళ్లినా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎత్తైన, భారీ కాయంతో హాలీవుడ్ సినిమాలో మాదిరిగా బాడీగార్డులు ఉంటారు. మస్క్ బాత్రూమ్కి వెళ్లిన సమయంలోనూ ఇద్దరు బాడీగార్డులు ఆయన్ను ఫాలో అవుతారు’ అని ట్విటర్ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుత పని వాతావరణాన్ని ఆ సంస్థలో పనిచేసే ఓ ఇంజినీర్ వెల్లడించారు. మస్క్కు ఉద్యోగుల పట్ల విశ్వాసం తక్కువని.. అందుకే భయంతో ఆఫీసులో తిరిగే సమయంలోనూ బాడీగార్డులను వెంట పెట్టుకొని ఉంటారని చెప్పారు.
గతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేవారని.. ప్రస్తుతం ఆఫీసులో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్విటర్ ఇంజినీర్ వెల్లడించారు. బయట నుంచి చూస్తే ఆఫీస్ బాగున్నట్లు కనిపిస్తుందని.. లోపల మాత్రం ఏ వస్తువూ పనిచేయదని వాపోయాడు. కార్యాలయంలోని సీసపు వస్తువులు, ట్యాప్లు కూడా పాడైపోయానని చెప్పారు.
ఇదిలాఉంటే, ట్విటర్లో అనేక మార్పులు చేస్తున్న ఎలాన్ మస్క్.. భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలోని కేంద్ర కార్యాలయంతోపాటు చాలా దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులనూ తొలగించారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!