Elon Musk: ఎలాన్ మస్క్.. బాత్రూం వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు..!
ట్విటర్ (Twitter) హెడ్ఆఫీసులో ఇటీవల పరిస్థితులు దారుణంగా మారాయని అక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాన్ మస్క్ (Elon Musk) ఆఫీసుకు వచ్చిన సమయంలో భారీ భద్రత ఉంటుందని.. ఆయన బాత్రూమ్కు వెళ్లిన సమయంలోనూ ఇద్దరు బాడీగార్డులు (Bodyguard) ఆయన వెంటే ఉంటారనే విషయం వెల్లడైంది.
వాషింగ్టన్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ను (Twitter) సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ (Elon Musk).. సంస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు మొదలు కార్యాలయాల్లో వస్తువుల అమ్మకం వంటి చర్యలు కొనసాగిస్తున్నారు. మస్క్ అనూహ్య నిర్ణయాలపై ఆసంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్ (Elon Musk) హెడ్ ఆఫీస్కు వచ్చిన సమయంలో ఎప్పుడూ సెక్యూరిటీ నడుమే ఉంటారని.. బాస్ బాత్రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఫాలో అవుతారని సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి మీడియాకు వెల్లడించారు.
‘ట్విటర్ ఆఫీసుకి ఎలాన్ మస్క్ వస్తే సెక్యూరిటీ సిబ్బంది ఆయన చుట్టే ఉంటారు. కార్యాలయంలో ఎక్కడికి వెళ్లినా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎత్తైన, భారీ కాయంతో హాలీవుడ్ సినిమాలో మాదిరిగా బాడీగార్డులు ఉంటారు. మస్క్ బాత్రూమ్కి వెళ్లిన సమయంలోనూ ఇద్దరు బాడీగార్డులు ఆయన్ను ఫాలో అవుతారు’ అని ట్విటర్ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుత పని వాతావరణాన్ని ఆ సంస్థలో పనిచేసే ఓ ఇంజినీర్ వెల్లడించారు. మస్క్కు ఉద్యోగుల పట్ల విశ్వాసం తక్కువని.. అందుకే భయంతో ఆఫీసులో తిరిగే సమయంలోనూ బాడీగార్డులను వెంట పెట్టుకొని ఉంటారని చెప్పారు.
గతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేవారని.. ప్రస్తుతం ఆఫీసులో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్విటర్ ఇంజినీర్ వెల్లడించారు. బయట నుంచి చూస్తే ఆఫీస్ బాగున్నట్లు కనిపిస్తుందని.. లోపల మాత్రం ఏ వస్తువూ పనిచేయదని వాపోయాడు. కార్యాలయంలోని సీసపు వస్తువులు, ట్యాప్లు కూడా పాడైపోయానని చెప్పారు.
ఇదిలాఉంటే, ట్విటర్లో అనేక మార్పులు చేస్తున్న ఎలాన్ మస్క్.. భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలోని కేంద్ర కార్యాలయంతోపాటు చాలా దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులనూ తొలగించారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!