Elon Musk: చైనాలో ల్యాండ్ అయిన ఎలాన్ మస్క్..!
Elon Musk China Visit: దాదాపు మూడేళ్ల తర్వాత ఎలాన్ మస్క్ చైనాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రైవేటు జెట్ తాజాగా బీజింగ్ విమానాశ్రయంలో కన్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: అపరకుబేరుడు, టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk ).. చైనా (China) పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ప్రైవేటు జెట్ బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే.. అందులో మస్క్ వచ్చారా? లేదా అన్నదానిపై స్పందించేందుకు టెస్లా కంపెనీ నిరాకరించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
ఆసియా కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం ఎలాన్ మస్క్ ప్రైవేట్ జెట్ (Musk Private Jet) అలస్కా నుంచి బయల్దేరినట్లు విమానాల రాకపోకలను ట్రాక్ చేసే ఏడీఎస్-బి ఎక్స్ఛేంజ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఈ జెట్ జపాన్, దక్షిణ కొరియా మీదుగా చైనా చేరుకున్నట్లు తెలుస్తోంది. బీజింగ్ విమానాశ్రయంలో మస్క్ ప్రైవేటు జెట్ను నిలిపి ఉంచిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఎలాన్ మస్క్ (Elon Musk) చైనాలో పర్యటించనున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆయన షెడ్యూల్పై అటు టెస్లా (Tesla) గానీ.. ఇటు బీజింగ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, మస్క్ డ్రాగన్ దేశానికి రావడం మూడేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. పర్యటనలో భాగంగా పలువురు సీనియర్ చైనీస్ అధికారులతో ఆయన భేటీ కానున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో పాటు షాంఘైలోని టెస్లా ప్లాంట్ను కూడా ఆయన సందర్శించనున్నట్లు సమాచారం. కాగా.. టెస్లా ప్లాంట్ల విస్తరణ కోసం భారత అధికారులతో మస్క్ బృందం ఇటీవల చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఆయన చైనా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
టెస్లా కంపెనీకి అమెరికా తర్వాత చైనా రెండో అతి పెద్ద మార్కెట్. ఈ సంస్థకు చెంందిన షాంఘై ప్లాంట్.. విద్యుత్ వాహనాలకు అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టెస్లాకు చైనా ఆటోమొబైల్ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న సమయంలో మస్క్ (Elon Musk).. బీజింగ్ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. షాంఘైలో దాదాపు 10 వేల మెగాప్యాక్ స్టోరేజీ యూనిట్ల ఉత్పత్తే లక్ష్యంగా అతిపెద్ద బ్యాటరీ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు మస్క్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..