Elon Musk: కొన్ని అలవాట్లు మానుకోవడం కష్టమే.. సొంత కామెంట్లపై మస్క్!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను చేసే రాజకీయ కామెంట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటువంటి వాటికి దూరంగా ఉంటానని గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. కొన్ని అలవాట్లు మార్చుకోవడం కష్టమేననంటూ ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk).. సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ నెట్టింట్లో నిత్యం వార్తల్లో ఉంటారు. ఇటీవల ట్విటర్ కొనుగోలు తర్వాత ఆయన దూకుడును మరింత పెంచారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ను షేర్ చేసిన మస్క్.. కొన్ని అలవాట్లు మార్చుకోవడం కష్టమేనంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉంటానని 2013లో పెట్టిన ఓ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ ఎలాన్ మస్క్ ఈ విధంగా స్పందించారు.
‘నన్ను చాలా ఇబ్బంది పెట్టిన రాజకీయ వ్యాఖ్యలు ఇక నుంచి చేయను’ అంటూ 2013 ఏప్రిల్లో ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. కానీ.., అమెరికా రాజకీయాలపై స్పందిస్తూ తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పాత ట్వీట్ను ప్రస్తావించిన ఆయన.. కొన్ని అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.
ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నికపై ప్రతిష్టంభన నెలకొంది. స్పీకర్గా సభ్యుల మద్దతు సాధించడంలో రిపబ్లికన్ పార్టీ సభ్యుడు కెవిన్ మెక్కార్తీ విఫలమయ్యారు. దీంతో స్పీకర్ను ఎన్నుకోకముందే సభ వాయిదా పడింది. 164ఏళ్లలో స్పీకర్ ఎన్నికకు సుదీర్ఘ సమయం పట్టిన ఘటన ఇదే. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఎలాన్ మస్క్.. తన మిత్రుడు, సీనియర్ సభ్యుడు కెవిన్ మెక్కార్తీ స్పీకర్ కావాలని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
అయితే, కెవిన్కు మస్క్ మద్దతు తెలపడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. మస్క్ అంతటితో ఆగలేదు. విమర్శలపైనా ట్విటర్లో పోలింగ్ నిర్వహించారు. ‘రాజకీయాలకు దూరంగా ఉండాలా..? మరిన్ని ఇబ్బందులు పడాలా..?’ అని ప్రశ్నిస్తూ ఎలాన్ మస్క్ ఓటింగ్ చేపట్టారు. ఇందులో మొత్తం 5.95లక్షలమంది పాల్గొనగా.. వారిలో 42.8శాతం మంది రాజకీయాలకు దూరంగా ఉండాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా 57.2శాతం మంది మంత్రి మస్క్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనంటూ ఓటు వేశారు. దీంతో కొన్ని అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టమని పేర్కొంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
అమెరికా రాజకీయాల గురించి ఎలాన్ మస్క్ మాట్లాడటం కొత్తేమీ కాదు. ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలోనూ రిపబ్లికన్లకు మద్దతు ఇస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా మెక్కార్తీ చేపట్టిన నిధుల సమీకరణకూ సహాయం చేశారు. వీటితోపాటు ఉక్రెయిన్ యుద్ధం, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి భర్తపై దాడి వంటి అంశాలపైనా ఎలాన్ మస్క్ స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు