మస్క్ మామూలోడు కాదు.. ఇ-మెయిల్తో లీకువీరుడ్ని పట్టేశాడు!
2008లో టెస్లా రహస్య డేటాను లీక్ చేసి, వార్తా సంస్థలకు విక్రయించిన ఆ ఉద్యోగిని ఎలా వల పన్ని పట్టుకున్నారో ఎలాన్ మస్క్ వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: అది 2008. అమెరికాను మాంద్యం కుదిపేస్తున్న రోజులవి. ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కూడా దాదాపు దివాళ అంచుకు చేరుకుంది. అదే సమయంలో కంపెనీని లీకుల బెడద వెంటాడుతోంది. కంపెనీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఎవరో ప్రెస్కు చేరవేస్తుండడం కంపెనీని మరింత కలవర పెట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆ లీకువీరుడ్ని తెలివిగా పట్టుకోగలిగారు. అదెలాగో తాజాగా ఎలాన్ మస్క్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
2008లో టెస్లా రహస్య డేటాను లీక్ చేసి, వార్తా సంస్థలకు విక్రయించిన ఆ ఉద్యోగిని ఎలా పట్టుకున్నారంటూ వైభవ్ బల్గరే అనే యూజర్ ఎలాన్ మస్క్ను ట్విటర్లో ప్రశ్నించారు. అదో ఆసక్తికర కథ అంటూ ఎలాన్ మస్క్ దానికి బదులిచ్చాడు. ‘‘ఉద్యోగులందరికీ ఒకే తరహా ఇ-మెయిల్స్ పంపించాం. కానీ ఒక్కో ఇ-మెయిల్లో వాక్యానికీ వాక్యానికీ మధ్య ఒకటీ లేదా రెండు స్పేస్లు ఇచ్చుకుంటూ వెళ్లాం. దీని ద్వారా సమాచారం లీక్ చేసే వ్యక్తి తాలూకా బైనరీ సిగ్నేచర్ క్రియేట్ అవుతుంది. తద్వారా ఆ లీకు చేసే వ్యక్తిని పట్టుకున్నాం’’ అని వివరించాడు. ‘ఆ తర్వాత.. ఆ ఉద్యోగిని ఏం చేశారు’ అంటూ మరో వ్యక్తి ప్రశ్నించగా.. ‘ఇంకో ఉద్యోగం చూసుకోమని పంపేశాం’ అని చెప్పాడు. ‘మరి జైలుకెందుకు పంపలేదు..?’ అని మరో యూజర్ ప్రశ్నించగా..‘నిలదొక్కుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాం.. అందుకే’ అంటూ బదలిచ్చాడు.
ఇంతకీ ఎలా కనిపెట్టారంటే..?
కంపెనీ సమాచారాన్ని ఎవరో లీక్ చేస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తన కంపెనీ ఉద్యోగులకు టెస్లా ఓ ఇ-మెయిల్ పంపింది. కంపెనీ ఏదైతే మెయిల్ పంపిందో అదే మెయిల్ను కోట్ చేస్తూ ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. టెస్లా ముందుగా ఊహించినదే జరిగింది. కంపెనీ ఉపయోగించిన ట్రిక్ వర్కౌట్ అయ్యింది. ఆ ఉద్యోగి ఎవరో గుర్తించింది. టెస్లా ప్రయోగించిన ట్రిక్ను ఓ యూజర్ వివరించే ప్రయత్నం చేశాడు. టెస్లా పంపిన ఇమెయిల్లో ఒక వాక్యం దగ్గర ఒక స్పేస్.. ఇంకో వాక్యం తర్వాత రెండు స్పేస్లు.. మరో వాక్యం తర్వాత ఒకటే స్పేస్ ఇచ్చిందనుకుందాం. అప్పుడు ఆ మెయిల్ యూజర్ బైనరీ కోడ్ 010 అవుతుంది. ఆ ప్రకారం ఒక్కో ఇ-మెయిల్కు ఒక్కో బైనరీ సిగ్నేచర్ ఉండేలా పంపించారు. అప్పుడు ఆ ఇ-మెయిల్ను ఎలాంటి ఎడిట్స్ లేకుండా వార్తగా ప్రచురించినప్పుడు సదరు బైనరీ సిగ్నేచర్ ఉన్న ఇ-మెయిల్ పంపిన వ్యక్తే లీకువీరుడిగా గుర్తించి ఉంటారని అతడు పేర్కొన్నాడు. దీన్నే కానరీ ట్రాప్ అని కూడా అంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసరం ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!