Elon Musk: ఎలాన్ మస్క్పై లైంగిక ఆరోపణలు.. 2.5 లక్షల డాలర్లతో సెటిల్మెంట్..?
ఓ ప్రైవేటు జెట్లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో ఎలాన్ మస్క్ అసభ్యకరంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.
అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనం
వాషింగ్టన్: గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు సంబంధించి తాజాగా కొత్త వ్యవహారం బయటపడింది. ఓ ప్రైవేటు జెట్లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో అసభ్యంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి స్పేస్ఎక్స్ సెటిల్మెంట్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అసత్యాలు అంటూ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
2016లో ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తున్న సమయంలో తన సొంత సంస్థలో (SpaceX) పనిచేస్తోన్న సహాయకురాలితో ఎలాన్ మస్క్ అసభ్యంగా ప్రవర్తించినట్లు బిజినెస్ ఇన్సైడర్ కథనం వెల్లడించింది. ఫ్లైట్ ప్రైవేటు రూమ్లో బాధితురాలిని అసభ్యకరంగా తాకడంతోపాటు.. నచ్చిన విధంగా మసాజ్ చేస్తే ఓ గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని మస్క్ చెప్పినట్లు వివరించింది. ఈ వివరాలను బాధితురాలి స్నేహితురాలు బహిర్గతం చేసినట్లు ఇన్సైడర్ కథనం పేర్కొంది. ఆ సమయంలో మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన బాధితురాలు స్పేస్ఎక్స్లో తన ఉద్యోగం పోతుందని ముందుగానే ఊహించినట్లు తెలిపింది. ఈ విషయంపై 2018లో ఓ లాయర్ను నియమించుకొని న్యాయపరంగా కేసును ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తాజా కథనం వెల్లడించింది.
కోర్టు బయటే సెటిల్మెంట్
అయితే, ఈ లైంగిక ఆరోపణలకు సంబంధించి 2018లో బాధితురాలికి రెండున్నరల లక్షల డాలర్లు ($2,50,000) చెల్లించి ఈ వ్యవహారాన్ని స్పేస్ఎక్స్ సెటిల్ చేసుకుందని తాజా నివేదిక వెల్లడించింది. కోర్టు బయట జరిగిన ఈ సెటిల్మెంట్ వ్యవహారానికి సంబంధించిన స్టేట్మెంట్ను బాధితురాలి స్నేహితురాలు చూపించినట్లు ఇన్సైడర్ కథనం పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా బాధితురాలితో స్పేస్ఎక్స్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు తాజా కథనంలో వివరించింది.
అవన్నీ అబద్ధాలే..
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు, సెటిల్మెంట్ వ్యవహారంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. తన స్నేహితురాలిని లైంగికంగా వేధించినట్లు చెబుతోన్న వ్యక్తి వాటిని నిరూపించగలరా. సవాల్ చేస్తున్నా.. అంటూ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. తనపై చేస్తోన్న దారుణమైన ఆరోపణలు పూర్తి అవాస్తవమంటూ ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లు చేశారు. ఇదిలాఉంటే, తనపై ఇటీవలికాలంలో రాజకీయ దాడులు ఎక్కువయ్యాయని ఎలాన్ మస్క్ చెబుతూ వస్తున్నారు. రానున్న నెలల్లో ఇవి మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటూ ఇటీవల ట్వీట్ చేశారు. ఇలా చెప్పిన కొన్ని రోజులకే ఆయనపై లైంగిక ఆరోపణల వ్యవహారం బయటకు రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM