UK Heatwave: ఎండల వేడికి మండుతోన్న ఇంగ్లాండ్.. తొలిసారి ‘ఎమర్జెన్సీ’ ప్రకటన
గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాడ్పులు వీస్తుండడంతో (Heat Waves) అప్రమత్తమైన బ్రిటన్ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది.
లండన్: గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్లో (UK) రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండడంతో (Heat Waves) అప్రమత్తమైన బ్రిటన్ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. లండన్తోపాటు ఇంగ్లాండ్లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాలపాటు ఇదేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ అత్యయికస్థితిని (Emergency) ప్రకటించిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బ్రిటన్లో చాలా ప్రాంతాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్కు చేరువవుతుండటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని బ్రిటన్ వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన మెట్.. ఇటువంటి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోగ్యానికి ఎంతో హానికరమన్న మెట్ కార్యాలయం.. ఈ హెచ్చరికలను ప్రజలు సీరియస్గా తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎండవేడికి దూరంగా ఉండడం, నివాస ప్రాంతాలను చల్లగా ఉండేటట్లు చూసుకోవడంతో పాటు హెచ్చరికలు ప్రకటించిన రోజుల్లో బయటి కార్యకలాపాలు, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించింది.
అధిక ఉష్ణోగ్రతల ప్రభావం సున్నితమైన వ్యవస్థలైన విద్యుత్, అత్యవసర సేవలైనటువంటి నీరు, మొబైల్ ఫోన్ సర్వీసులపై పడే అవకాశం ఉందని మెట్ విభాగం తెలిపింది. మరోవైపు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) కూడా అత్యంత తీవ్రమైన నాలుగో అలర్ట్ను ప్రకటించింది. ఈ పరిస్థితుల వల్ల ఆరోగ్యవంతులైన వారు కూడా అనారోగ్యం బారినపడవచ్చని.. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఇలా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న బ్రిటన్ వాసులు.. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీచ్ల వెంట పరుగులు తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి. -
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ