Equatorial Guinea: 43ఏళ్లుగా అధికారంలో ‘ఒకే ఒక్కడు’.. మరోసారి ఆయనకే ఛాన్స్..!
ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్ గ్వీమాగే మళ్లీ గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గడిచిన 43ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆయన.. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మలాబో: ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు పాలించిన నేతగా రికార్డుకెక్కిన ఆఫ్రికా ఖండంలోని ఈక్వెటోరియల్ గినియా (Equatorial Guinea) అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్ గ్వీమా మబాసోగో (80) మరోసారి ఆ ఛాన్స్ కొట్టేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం (నవంబర్ 20న) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. కేవలం ఇద్దరు ప్రత్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నారు. 14 ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఒబియాంగ్కు మద్దతుగా నిలిచాయి. దీంతో ఇప్పటికే 43 ఏళ్లుగా గినియాను పాలిస్తున్న ఆయన.. ఈసారి కూడా మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియా జనాభా సుమారు 15లక్షలు. చమురు, సహజవాయు నిల్వలు పుష్కలంగా ఉన్న ఆ దేశం 1968లో స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అనంతరం దేశ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన ఫ్రాన్సిస్కో మాసియస్ గ్వీమాపై తిరుగుబాటు చేసిన ఒబియాంగ్.. 1979లో పాలనా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆ దేశాన్ని పాలిస్తున్న ఆయన.. తదనంతర ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇలా గడిచిన 43 ఏళ్లుగా గినియాను (Teodoro Obiang Nguema) పాలిస్తున్న ఆయన.. తాజా ఎన్నికల్లోనూ తననే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడ 4లక్షల మందికిపైగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ టియోడోరో ఒబియాంగ్కు ఎన్నడూ 90శాతం కంటే తక్కువ ఓట్లు రాలేదు. ఇలా నాలుగన్నర దశాబ్దాలుగా పాలిస్తున్నప్పటికీ.. దేశంలో అవినీతి వ్యవస్థను ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి. భారీ స్థాయిలో చమురు నిల్వలు ఉన్న ఆ దేశాన్ని పేదరికం నుంచి విముక్తి కల్పించే అవకాశాలున్నప్పటికీ.. అలా చేయడంలో టియోడోరో ఒబియాంగ్ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఒబియాంగ్ పాలనలో ప్రత్యర్థులను బెదిరించడం, మరణశిక్షలు అమలు వంటి విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని మానవ హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి