Hijab Protests: నిరసనకారుడికి మరణ శిక్ష విధించిన వేళ.. ఇరాన్పై మరిన్ని ఆంక్షలు!
హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలకు సంబంధించి మొదటిసారి ఓ వ్యక్తికి మరణశిక్ష విధించిన వేళ.. ఇరాన్పై మరిన్ని ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ వహిదీసహా 29 మంది ప్రముఖులు, నాలుగు ప్రభుత్వ విభాగాలను తాజాగా తమ ఆంక్షల జాబితాలో చేర్చినట్లు యూరోపియన్ యూనియన్తెలిపింది.
టెహ్రాన్: హిజాబ్ వ్యతిరేక ప్రదర్శన(Hijab Protests)లకు సంబంధించి మొదటిసారి ఓ వ్యక్తికి మరణశిక్ష విధించిన వేళ.. ఇరాన్(Iran)పై మరిన్ని ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ వహిదీ సహా 29 మంది ప్రముఖులు, నాలుగు ప్రభుత్వ విభాగాలను తాజాగా తమ ఆంక్షల జాబితాలో చేర్చినట్లు యూరోపియన్ యూనియన్(EU) ప్రకటించింది. స్థానికంగా నిరసనలను హింసాత్మకంగా అణచివేస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈయూ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు సోమవారం బ్రసెల్స్లో ఈ మేరకు సమావేశమయ్యారు.
‘మేం ఇరాన్ ప్రజలకు అండగా నిలుస్తాం. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు మద్దతు ఇస్తాం. వారిపై ఉక్కుపాదం మోపుతోన్న వ్యక్తులపై మరో ఆంక్షల ప్యాకేజీని ఆమోదించాం’ అని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ ఓ ప్రకటనలో చెప్పారు. తాజా ఆంక్షలతో ఈయూ వీసాల నిషేధం, ఆస్తుల నిలిపివేత వంటి చర్యలు అమల్లోకి వస్తాయి. ఈయూ ఇప్పటికే.. ఇరాన్ నైతిక పోలీసు విభాగం, రెవల్యూషనరీ గార్డ్స్ తదితర సంస్థలతోపాటు సమాచార మంత్రి సహా 11మందిపై ఆంక్షలు విధించింది.
ఇదిలా ఉండగా.. సెప్టెంబరులో మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఆమె హిజాబ్ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరసనల్లో ఇప్పటివరకు 336 మంది మృతి చెందారని, దాదాపు 15వేలకుపైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!