Switzerland : ఐరోపాలోనే ఎత్తయిన రైల్వేస్టేషన్.. అండర్గ్రౌండ్లో..!
పర్యాటకానికి పెట్టింది పేరు స్విట్జర్లాండ్ (Switzerland). అక్కడి అద్భుత నిర్మాణ ప్రదేశాల్లో ‘జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ (Railway station) ఒకటి. ప్రపంచం (World) నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు (Tourist) పోటెత్తుంటారు. అందమైన మంచు పర్వతాలను సందర్శిస్తూ పరవశించి పోతుంటారు.
(Image : Social media)
స్విట్జర్లాండ్లో (Switzerland) సుందరమైన ఆల్ప్స్ పర్వతాలపై (Alps mountain) 11332 అడుగుల ఎత్తులో ‘జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ (Jungfraujoch railway) ఉంది. ఇది ఐరోపాలోనే (Europe) ఎత్తయిన రైల్వేస్టేషన్గా అధికారిక గుర్తింపు పొందింది.. ఒక దశాబ్దం కిందట మానవులు సృష్టించిన ఇంజినీరింగ్ అద్భుతం ఈ రైల్వేస్టేషన్. జంగ్ఫ్రా, మోంచ్ పర్వతాల రాళ్లను తొలిచి దీన్ని నిర్మించారు. ఆ రెండు పర్వతాల ఎత్తు దాదాపు 4వేల మీటర్లు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి..
1862లో తొలిసారి ఓ వ్యక్తి జంగ్ఫ్రాజోచ్ను చేరుకున్నాడట. ఆ తరువాత ఆంగ్లో-స్విస్ బృందం ఒకటి ఆ పర్వతాన్ని అధిరోహించింది. అప్పట్లో అదో చారిత్రాత్మక విజయంగా నమోదైంది. ఆ సంఘటన జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత జంగ్ఫ్రాజోచ్ రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం స్విస్ వ్యాపారవేత్త అడాల్ఫ్ గుయెర్ జెల్లర్ ఒక ప్రణాళికను తయారు చేశాడు. దాని గురించి తెలిసి తొలుత అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా నిర్మాణానికి స్థానిక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ ప్రాజెక్టు 16ఏళ్లపాటు కొనసాగింది. వందలాది మంది కార్మికులు ఆల్ప్స్ పర్వతాల్లో నిరంతరాయంగా పనిచేశారు. ఈ క్రమంలో అనేక చోట్ల కొండలను తొలిచారు. మరి కొన్ని చోట్ల సొరంగ మార్గాలు నిర్మించడానికి డైనమైట్లు పేల్చారు. దాంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిర్మాణం మొత్తం పూర్తయ్యేలోపు అధికారికంగానే 30 మంది మరణించారు.
(Image : Social media)
స్వర్గ మార్గంలా ప్రయాణం!
జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ ప్లాన్ను తొలుత పేపర్పై గీసినప్పుడు అది విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా 1912 కల్లా ఆ రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి అది నిరంతరాయంగా పనిచేస్తోంది. తొలినాళ్లలో పర్వతారోహకులు కష్టపడినట్లు ఇప్పుడు ఎవరూ సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. రైలు ఎక్కితే అనేక మనోహర దృశ్యాలను చూస్తూ 30 నిమిషాల్లోనే ఆ స్టేషన్కు చేరుకోవచ్చు. రైలు క్లైన్ స్కీడెగ్ వద్ద ప్రారంభమవుతుంది. ఆ ప్రదేశం సముద్ర మట్టానికి 2060 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి 9.3 కిలోమీటర్లు ప్రయాణిస్తే 3454 మీటర్ల ఎత్తులో.. అండర్గ్రౌండ్లో ఉన్న ‘జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ తారసపడుతుంది. ఒక బహిరంగ ప్రదేశంలో రైలు మొదలై.. వందేళ్ల క్రితం కొండలను పగులగొట్టి నిర్మించిన సొరంగ మార్గం గుండా అది వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. కొన్ని సొరంగాల వద్ద పనోరమిక్ కిటీకీలున్నాయి. వాటి నుంచి ప్రకృతిని చూస్తే ఆల్ప్స్ పర్వతశ్రేణులు ఒక స్వర్గంలా కనిపిస్తాయి.
టికెట్ ఖరీదు ఎంతంటే..!
ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన రైల్వేస్టేషన్ను చేరుకోవడానికి ఖర్చు కూడా ఎక్కువే. ఒక్కో టికెట్ ఖరీదు 245 డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఆ మొత్తం రూ.20వేలు. అయినా ఖర్చుకు వెనుకాడకుండా పర్యాటకులు ఈ స్టేషన్ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వాతావరణం నిమిషాల వ్యవధిలోనే మారుతుందట. అన్ని ప్రదేశాలు స్పష్టంగా కనిపించేలా ఆ రోజు ఉందంటే వారు నిజంగా అదృష్టవంతులేనట. స్టేషన్ పైకి ఎక్కి ఎటు వైపు చూసినా దాదాపు 200 పర్వతాలు కనిపిస్తాయని సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్