Switzerland : ఐరోపాలోనే ఎత్తయిన రైల్వేస్టేషన్.. అండర్గ్రౌండ్లో..!
పర్యాటకానికి పెట్టింది పేరు స్విట్జర్లాండ్ (Switzerland). అక్కడి అద్భుత నిర్మాణ ప్రదేశాల్లో ‘జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ (Railway station) ఒకటి. ప్రపంచం (World) నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు (Tourist) పోటెత్తుంటారు. అందమైన మంచు పర్వతాలను సందర్శిస్తూ పరవశించి పోతుంటారు.
(Image : Social media)
స్విట్జర్లాండ్లో (Switzerland) సుందరమైన ఆల్ప్స్ పర్వతాలపై (Alps mountain) 11332 అడుగుల ఎత్తులో ‘జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ (Jungfraujoch railway) ఉంది. ఇది ఐరోపాలోనే (Europe) ఎత్తయిన రైల్వేస్టేషన్గా అధికారిక గుర్తింపు పొందింది.. ఒక దశాబ్దం కిందట మానవులు సృష్టించిన ఇంజినీరింగ్ అద్భుతం ఈ రైల్వేస్టేషన్. జంగ్ఫ్రా, మోంచ్ పర్వతాల రాళ్లను తొలిచి దీన్ని నిర్మించారు. ఆ రెండు పర్వతాల ఎత్తు దాదాపు 4వేల మీటర్లు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి..
1862లో తొలిసారి ఓ వ్యక్తి జంగ్ఫ్రాజోచ్ను చేరుకున్నాడట. ఆ తరువాత ఆంగ్లో-స్విస్ బృందం ఒకటి ఆ పర్వతాన్ని అధిరోహించింది. అప్పట్లో అదో చారిత్రాత్మక విజయంగా నమోదైంది. ఆ సంఘటన జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత జంగ్ఫ్రాజోచ్ రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం స్విస్ వ్యాపారవేత్త అడాల్ఫ్ గుయెర్ జెల్లర్ ఒక ప్రణాళికను తయారు చేశాడు. దాని గురించి తెలిసి తొలుత అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా నిర్మాణానికి స్థానిక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ ప్రాజెక్టు 16ఏళ్లపాటు కొనసాగింది. వందలాది మంది కార్మికులు ఆల్ప్స్ పర్వతాల్లో నిరంతరాయంగా పనిచేశారు. ఈ క్రమంలో అనేక చోట్ల కొండలను తొలిచారు. మరి కొన్ని చోట్ల సొరంగ మార్గాలు నిర్మించడానికి డైనమైట్లు పేల్చారు. దాంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిర్మాణం మొత్తం పూర్తయ్యేలోపు అధికారికంగానే 30 మంది మరణించారు.
(Image : Social media)
స్వర్గ మార్గంలా ప్రయాణం!
జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ ప్లాన్ను తొలుత పేపర్పై గీసినప్పుడు అది విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా 1912 కల్లా ఆ రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి అది నిరంతరాయంగా పనిచేస్తోంది. తొలినాళ్లలో పర్వతారోహకులు కష్టపడినట్లు ఇప్పుడు ఎవరూ సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. రైలు ఎక్కితే అనేక మనోహర దృశ్యాలను చూస్తూ 30 నిమిషాల్లోనే ఆ స్టేషన్కు చేరుకోవచ్చు. రైలు క్లైన్ స్కీడెగ్ వద్ద ప్రారంభమవుతుంది. ఆ ప్రదేశం సముద్ర మట్టానికి 2060 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి 9.3 కిలోమీటర్లు ప్రయాణిస్తే 3454 మీటర్ల ఎత్తులో.. అండర్గ్రౌండ్లో ఉన్న ‘జంగ్ఫ్రాజోచ్’ రైల్వేస్టేషన్ తారసపడుతుంది. ఒక బహిరంగ ప్రదేశంలో రైలు మొదలై.. వందేళ్ల క్రితం కొండలను పగులగొట్టి నిర్మించిన సొరంగ మార్గం గుండా అది వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. కొన్ని సొరంగాల వద్ద పనోరమిక్ కిటీకీలున్నాయి. వాటి నుంచి ప్రకృతిని చూస్తే ఆల్ప్స్ పర్వతశ్రేణులు ఒక స్వర్గంలా కనిపిస్తాయి.
టికెట్ ఖరీదు ఎంతంటే..!
ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన రైల్వేస్టేషన్ను చేరుకోవడానికి ఖర్చు కూడా ఎక్కువే. ఒక్కో టికెట్ ఖరీదు 245 డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఆ మొత్తం రూ.20వేలు. అయినా ఖర్చుకు వెనుకాడకుండా పర్యాటకులు ఈ స్టేషన్ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వాతావరణం నిమిషాల వ్యవధిలోనే మారుతుందట. అన్ని ప్రదేశాలు స్పష్టంగా కనిపించేలా ఆ రోజు ఉందంటే వారు నిజంగా అదృష్టవంతులేనట. స్టేషన్ పైకి ఎక్కి ఎటు వైపు చూసినా దాదాపు 200 పర్వతాలు కనిపిస్తాయని సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం