kim: రూ.4,500 కోట్ల దోపిడీ.. కిమ్ జాతిరత్నాల పనే..!
కిమ్ తలుచుకొంటే ఎక్కడి నుంచైనా ఖరీదైన కార్లు ఫ్యాక్ అయి.. ప్యాంగ్యాంగ్ దిశగా బయల్దేరతాయి.. ఉ.కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వము అంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే.
వెల్లడించిన అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఉత్తర కొరియా నియంత కిమ్ తలుచుకొంటే ఎక్కడి నుంచైనా ఖరీదైన కార్లు ఫ్యాక్ అయి.. ప్యాంగ్యాంగ్ దిశగా వెళ్తాయి. ఉ.కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వం అంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే.. వాటిని తప్పించుకొని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టారు. మరి క్రిప్టోలను తయారు చేయడానికి అవసరమైనంత విద్యుత్తు ఉ.కొరియాలో లేదుగా.. అక్కడ చాలా నగరాల్లో రాత్రివేళలు లైట్లు కూడా వేయరు కదా..! అనే సందేహం రావచ్చు. అది నిజమే అయినా.. కిమ్ అమ్ములపొదిలో జాతిరత్నాల్లాంటి హ్యాకర్లు ఉన్నారు. వారు బ్లాక్చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ఛేంజిల్లోకి చొరబడి దోపిడీ చేయగలరు. ఆ సొమ్ముతో దీపావళీ పటాసుల వలే కిమ్ ఆయుధ ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా కిమ్ జాతిరత్నాలు ఒక్కదెబ్బకు మరో రూ.4,500 కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీలకు కన్నంపెట్టినట్లు తేలింది.
ఒక్కదెబ్బకు 600 మిలియన్ డాలర్లు హాంఫట్..!
గత నెల 23వ తేదీన క్రిప్టో కరెన్సీలను సంపాదించడానికి ఆడే యాక్సిస్ ఇన్ఫినిటీ అనే ఓ వీడియోగేమ్ నెట్వర్క్ను వాడుకొని ఉత్తరకొరియాకు చెందిన హ్యాకింగ్ బృందాలైన లాజరస్, ఏపీటీ38లు.. 620 మిలియన్ డాలర్ల విలువైన ఇథేరియం అనే క్రిప్టో కరెన్సీని అపహరించాయి. ఈవిషయాన్ని మార్చి 29న అధికారికంగా ప్రకటించారు. యాక్సిస్ ఇన్ఫినిటీ అనే గేమ్ను స్కైమావిస్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ వీడియోగేమ్లో వినియోగదారులు క్రిప్టోలను ఒకరి నుంచి మరొకరికి పంపే నెట్వర్క్ను వాడుకొని హ్యాకర్లు ఈ అపహరణకు పాల్పడ్డారు.
అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం లాజరస్ గ్రూప్పై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా ప్రభుత్వం కోసం క్రిప్టోలను సంపాదించేందుకు ఈ గ్రూపు పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ ఈ గ్రూపు వినియోగించే వాలెట్పై కూడా ఆంక్షలు ప్రకటించింది.
క్రిప్టో సొమ్ముతో అణుబాంబులు, క్షిపణలు..!
ఉత్తర కొరియా ఆధీనంలోని బృందాలు గత కొన్నేళ్లుగా హ్యాకింగ్లతో అక్కడి ప్రభుత్వానికి అవసరమైన నిధులను సంపాదిస్తున్నాయి. ఈ సొమ్ముతో ఉ.కొరియా అణ్వాయుధాలు, క్షిపణలు తయారు చేస్తోందని ఐరాస పరిశోధక బృందాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లలోనే లాజరస్ గ్రూప్ ఒక్కటే 1.75 బిలియన్ డాలర్ల విలువైన సొమ్మును కాజేసినట్లు డిజిటల్ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ ‘చైన్ ఎనాలసిస్’ పేర్కొంది.
‘చైన్ ఎనాలసిస్’ జనవరిలో ప్రచురించిన నివేదిక ప్రకారం ఉ.కొరియా హ్యాకర్లు గత ఏడాది 400 మిలియన్ డాలర్లు విలువైన డిజిటల్ ఆస్తులను దొంగలించారని పేర్కొంది. 2019లో రెండు బిలియన్ డాలర్ల ఆయుధాల తయారీకి ఈ సొమ్ము వెచ్చించారని.. ఇది హ్యాకింగ్ల ద్వారా సంపాదించిందేనని పేర్కొంది. ఆంక్షలు విధించిన ఉ.కొరియాకు మెటీరియల్, సాంకేతికత స్వేచ్ఛగా దొరకడానికి ఈ సొమ్మే కారణమని అమెరికా, ఐరాస నిపుణులు భావిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత గత వారం ఆ దేశం తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది.
బొగ్గు, ‘యాపిల్ జ్యూస్’.. ఇవే ఉ.కొరియా జీవరేఖలు
సియోల్లోని బ్యాంక్ ఆఫ్ కొరియా లెక్కల ప్రకారం 2020లోనే ఉత్తరకొరియా జీడీపీలో వచ్చిన మొత్తంలో ఏకంగా 8శాతం సైబర్ క్రైమ్లను ఉపయోగించి సంపాదించిందని బ్యాంక్ ఆఫ్ సియోల్ వెల్లడించింది. ఈ బ్యాంక్ ఉ.కొరియా ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తోంది. 2019 తర్వాత నుంచి ఆ దేశ సరిహద్దులను ఉ.కొరియా మూసివేసింది. దీంతో ఆ దేశానికి రెండు మార్గాల్లోనే ఆదాయం లభిస్తోంది.
అంతర్జాతీయ ఆంక్షలను అతిక్రమించి బొగ్గు రవాణా చేయడం కూడా ఉ.కొరియా ప్రధాన ఆదాయ వనరు. ఇందుకోసం ఉ.కొరియా నౌకలు బొగ్గు తీసుకొని అంతర్జాతీయ జలాల్లోకి చేరుకొని తమ ఎలక్ట్రానిక్ సంకేతాలను ఉపగ్రహాలకు పంపే వ్యవస్థలను ఆపేసి.. రహస్యంగా ఇతర నౌకల్లోకి వాటిని అన్లోడింగ్ చేస్తాయి.
ఉత్తర కొరియా ప్రభుత్వ క్రిప్టో కరెన్సీల లావాదేవీల నుంచి అపహరణలకు పాల్పడేలా ‘యాపిల్ జ్యూస్’ పేరిట ఓ మాల్వేర్ను వినియోగిస్తోంది. 2018 నుంచి ఈ మాల్వేర్లోని పలు వెర్షన్లను వినియోగించి 30 దేశాల్లో సైబర్ దాడులు చేసింది. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఈ యాపిల్ జ్యూస్ హ్యాకర్లు 316 మిలియన్ డాలర్లను అపహరించారు.
కిమ్ అధికారంలోకి రాగానే హ్యాకర్లకు పెద్దపీట..
కిమ్ అధికారం చేపట్టినప్పటి నుంచి సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. ఉ.కొరియా నిఘా విభాగం ఈ వ్యహారాలను పర్యవేక్షిస్తోంది. 2021 నాటికి మొత్తం బ్యూరో-21గా పిలిచే సైబర్ వార్ఫేర్ గైడెన్స్ యూనిట్లో 6,000 మంది ఉన్నారు.
వీటిల్లోని బ్లూనోరోఫ్గా పిలిచే బృందంలో 1,700 మంది హ్యాకర్లు ఉన్నారు. వీరు ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్లు చేయడంతోపాటు.. ప్రత్యర్థుల నెట్వర్క్ బలహీతలను సుదీర్ఘకాలంగా అధ్యయనం చేస్తున్నారు. ఆండీరీల్ అనే గ్రూపులో మరో 1600 మందికి ప్రత్యర్థుల కంప్యూటర్ నెట్వర్కుల్లో బలహీనతలను గుర్తించడమే పని. ఈ విషయాలను 2020లో ఉ.కొరియా రక్షణరంగ సామర్థ్యాలపై అమెరికా సైన్యం తయారు చేసిన నివేదికలో వెల్లడించినట్లు బ్లూమ్బెర్గ్ కథనంలో పేర్కొంది. ఈ హ్యాకింగ్లకు పాల్పడిన వారికి కొంత మొత్తం రివార్డులు కూడా అక్కడి ప్రభుత్వం ఇస్తోంది.
అమెరికా అరికట్టలేదా..?
ఉ.కొరియా హ్యాకర్లు దాడి చేస్తున్నారని అమెరికా గుర్తించినా.. వారిపై ప్రతిదాడి చేయడం కష్టతరంగా మారింది. ఆ దేశంలో నెట్వర్క్కు కనెక్ట్ అయిన పరికరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఆక్కడి మొబైల్ ఫోన్లకు మిగిలిన వెబ్ ప్రపంచంతో సంబంధాలు ఉండవు. దీంతో ఉ.కొరియాపై సైబర్ దాడులకు అవకాశాలు పరిమితంగా ఉంటాయి. అంటే కిమ్ ప్రభుత్వ హ్యాకర్లను ఇప్పట్లో అడ్డుకోవడం కష్టసాధ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!