Guinness world record: 50 ఏళ్ల వయస్సులో 19 ఏళ్ల రికార్డును తిరగరాసి..!
లిండా పాట్గియేటర్ అనే మహిళ కేవలం 59 నిమిషాల్లో 23 బంగీ జంప్స్ పూర్తి చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 19 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా మహిళ పేరిట ఉన్న రికార్డు (గంటలో 19బంగీజంప్స్)ను ఆమె బద్దలుకొట్టారు.
ఇంటర్నెట్డెస్క్: గిన్నిస్ రికార్డు సాధించడమే ఎంతో గొప్ప. అది కూడా ఓ సాహస క్రీడలో 50 ఏళ్ల ఓ మహిళ నెలకొల్పారంటే అద్భుతమే కదా. ఇంగ్లాండ్కు చెందిన లిండా పాట్గియేటర్ అనే యాభై ఏళ్ల మహిళ కేవలం 59 నిమిషాల్లో 23 ‘బంగీజంప్స్’ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 19 ఏళ్ల కిత్రం దక్షిణాఫ్రికా మహిళ వెరోనికా పేరిట ఉన్న రికార్డు (గంటలో 19 బంగీ జంప్స్)ను తిరగరాశారు. దక్షిణాఫ్రికాలోని బ్లౌక్రన్స్ వంతెన ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది. బ్లౌక్రన్ నదిపై 216 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. దక్షిణాఫ్రికాలో అత్యంత ఎత్తయిన వంతెన ఇదేనట.పాట్గియేటర్ ఈ రికార్డు నెలకొల్పడం అంత సులువుగా జరగలేదు. దీని కోసం ఆమె కఠోర సాధన చేశారు. ఎయుజీన్ ఎలాఫ్ అనే ట్రైనర్ వద్ద మెలకువలు నేర్చుకున్నారు. 50 ఏళ్ల వయస్సులో ఇలాంటి సాహసాలు చేయాలంటే శరీరం బాగా సహకరించాలి. దీనికి అనుగుణంగా ఆమె పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందారు.
‘‘ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం నిర్వహించిన ఈవెంట్కు పాట్గియేటర్ సిద్ధమైనప్పుడు ఆమె ఏమాత్రం భయపడలేదు. వడివడిగా బ్లౌక్రన్ వంతెన మీదకు చేరుకున్నారు. ప్లాట్ ఫాం మీదకి వెళ్లి కిందికి దూకిన తర్వాత గద్ద మాదిరిగా రెండు చేతులూ చాపి దూసుకెళ్లారు.’’ అని జీడబ్ల్యూఆర్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. 23 నిమిషాలు గడిచేసరికి ఆమె పదో జంప్ను పూర్తి చేసినట్లు తెలిపింది. ఏకదాటిగా గంటపాటు జంప్స్ చేయాలంటే చాలా బలం కావాలి. రక్తనాళాలన్నీ దృఢంగా ఉండాలి. వయసు ప్రభావం కొంతమేరైనా ఉంటుంది. అందువల్ల ఆమె అలసిపోయినట్లు కనిపించింది’’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డు పేర్కొంది. పేర్కొంది.
దక్షిణాఫ్రికా మహిళ పేరిట ఉన్న రికార్డును సమం చేసినప్పటికి పాట్గియేటర్ బాగా ఇబ్బంది పడినట్లు జీడబ్లూఆర్ పేర్కొంది. అయితే సాధించాలన్న తపన ఆమెను ఆగనివ్వలేదు. కేవలం 59 నిమిషాల్లోనే 23 బంగీజంప్స్ పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేవుడి దయతోనే ఈ రికార్డు సాధించానని అన్నారు. తనకు పూర్తి సహకారం అందించిన భర్త, పిల్లలకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు