Finland: నాటోలో చేరొద్దన్న రష్యా.. పట్టించుకోమన్న ఫిన్లాండ్..
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ విషయంలో రష్యా తీసుకున్న నిర్ణయానికి ప్రపంచ దేశాలన్ని నివ్వెరపోయ్యాయి. ఉక్రెయిన్పై యుద్ధం చేయనున్నట్లు రష్యా ప్రకటించిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు మారణహోమం జరుగుతూనే ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ విషయంలో రష్యా తీసుకున్న నిర్ణయానికి ప్రపంచ దేశాలన్ని నివ్వెరపోయ్యాయి. ఉక్రెయిన్పై దండయాత్ర చేయనున్నట్టు రష్యా ప్రకటించిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు మారణహోమం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఎటుచూసినా శవాల గుట్టలు, ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇలా ఒకటా..రెండా చిన్న దేశమైన ఉక్రెయిన్ పుతిన్ ధాటికి అల్లాడిపోతూనే అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకనుకోకండి.. ఈ యుద్ధం వెనుక ఉన్న ప్రధాన కారణం, రష్యాకు అసలు నచ్చని చర్యకు మరో దేశం ముందడుగు వేయబోతుంది. అదే.. నాటోలో చేరడం. అవును.. ఉక్రెయిన్- రష్యాల యుద్ధానికి ప్రధాన కారణమైన నాటోలో చేరేందుకు మరో దేశం సిద్ధమైంది. అది ఏదో కాదు. రష్యాతో తన తూర్పు సరిహద్దును పంచుకున్న ఫిన్లాండ్.
వేగంగా చర్యలు తీసుకుంటాం:
నాటో కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫిన్లాండ్ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి గురువారం ప్రకటించారు. ఫిన్లాండ్ ప్రభుత్వం ఇటీవలే జాతీయ భద్రతపై దేశ పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. దీని తర్వాత ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంటుందని అంతా ఊహించిన విషయమే. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘నాటో సభ్యత్వం ఫిన్లాండ్ భద్రతను పటిష్ఠం చేస్తుంది. ఆలస్యం చేయకండా నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నిర్ణయం పై వేగంగా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే నాటో ఫిన్లాండ్తో చర్చలకు ఆహ్వానిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఫిన్లాండ్ పొరుగున ఉన్న స్వీడన్ సైతం ఇదే ఆలోచనలో ఉంది.
నిర్ణయంపై రష్యా హెచ్చరిక:
ఇరు దేశాలను ఉద్దేశించి రష్యా తాజాగా హెచ్చరించింది. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొంది. రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా ఇటీవల మాట్లాడుతూ.. ‘ స్వీడన్, ఫిన్లాండ్లకు బాగా తెలుసు. దీని గురించి వారు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నాటోలో చేరితే ఏమవుతుందో వారికి పూసగుచ్చినట్లు చెప్పాం’అని తెలిపిన విషయం తెలిసిందే. అయినా ఫిన్లాండ్ ఈ రోజు నాటోలో సభ్యత్వంపై ప్రకటన చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ