NATO: తుర్కియే గ్రీన్ సిగ్నల్... నాటో కూటమిలోకి ఫిన్లాండ్!
నాటో (NATO) కూటమిలో చేరేందుకు ఫిన్లాండ్కు (Finland) మార్గం దాదాపు సుగమమైంది. నాటో చీఫ్ స్టోలెన్బెర్గ్ (Jens Stoltenberg) చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి.
బ్రసెల్స్: నార్డిక్ (Nordic) దేశమైన ఫిన్లాండ్ (Finland) నాటో (NATO) కూటమిలో చేరేందుకు మార్గం దాదాపు సుగమమైంది. నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్బెర్గ్ (Jens Stoltenberg) చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఫిన్లాండ్ నాటో సభ్యదేశం కాబోతోందని ఆయన అన్నారు. స్థానిక పరిస్థితులను సానుకూలంగా మార్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడిని ఆయన అభినందించారు.‘‘ నాటో ప్రధాన కార్యాలయంలో ఫిన్లాండ్ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుందా? అని ఎదురు చూస్తున్నాను. ఆ దేశం మా సరసన చేరితే మేం మరింత దృఢంగా, క్షేమంగా ఉంటాం’’ అని స్టోలెన్బెర్గ్ ట్విటర్లో రాసుకొచ్చారు. నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలను నార్డిక్ దేశాలుగా చెబుతారు.
నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరికపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తుర్కియే కూడా గురువారం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు అక్కడి పార్లమెంట్ తీర్మానించింది. దీంతో ఫిన్లాండ్ చేరికకు దాదాపు మార్గం సుగమైనట్లే . ఫిన్లాండ్ రక్షణ పరంగా పటిష్ఠంగా ఉందని, ఆ దేశ శక్తిసామర్థ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు నాటో కూటమిని మరింత దృఢంగా తయారు చేస్తాయని స్టోలెన్బెర్గ్ అభిప్రాయపడ్డారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో వచ్చేవారం నాటో సభ్యదేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో ఫిన్లాండ్ సభ్యత్వంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
నాటో.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనినే ఉత్తర అట్లాంటిక్ కూటమి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదాల్చింది. కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలవడంతో పాటు సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి.
ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్ నాటోలో చేరికపై ప్రజల నుంచి మద్దతు లభించింది. ఫిన్లాండ్ 1,300 కిలోమీటర్ల సరిహద్దులను రష్యాతో పంచుకొంటోంది. ఇప్పటి వరకు రష్యాతో విరోధం వద్దునుకొని ఫిన్లాండ్ నాటోలో చేరలేదు. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో నాటోలో చేరేందుకు మొగ్గు చూపింది. అయితే, ఫిన్లాండ్ చేరికపై తుర్కియే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిన్లాండ్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని అందుకే ఆదేశం నాటోలో చేర్చుకోవడంపై సదాభిప్రాయం లేదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే, తాజాగా తుర్కియే కూడా అనుకూలంగా స్పందించడంతో ఫిన్లాండ్ చేరిక అనివార్యమనే చెప్పాలి. ఒక దేశం.. నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. ముందుగా కూటమిలోని 30 సభ్యత్వ దేశాలు దానికి అధికారిక ఆహ్వానాన్ని అందించేందుకు ఏకగ్రీవంగా అంగీకరించాలి. అనంతరం.. సభ్యత్వంపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత.. సభ్య దేశాలు తుది నిర్ణయాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
నడుం నొప్పి.. కుంగుబాటు.. తలనొప్పి
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్